AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పొట్టి ఫార్మాట్‌లో ఏకైక భారతీయుడిగా రికార్డ్..

Hardik Pandya: హార్దిక్ కంటే ముందు, భారతదేశం నుంచి T20 ఇంటర్నేషనల్‌లో యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ ఫీట్ చేశారు.

IND vs WI: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పొట్టి ఫార్మాట్‌లో ఏకైక భారతీయుడిగా రికార్డ్..
Hardik Pandya
Venkata Chari
|

Updated on: Aug 03, 2022 | 1:59 PM

Share

IND vs WI: భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ఇంటర్నేషనల్‌లో అద్భుతమైన రికార్డు (Hardik Pandya) నెలకొల్పాడు. హార్దిక్ అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసిన వెంటనే, అతను తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత్ తరపున ఆరో బౌలర్‌గా హార్దిక్ నిలిచాడు. హార్దిక్ కంటే ముందు, భారతదేశం నుంచి T20 ఇంటర్నేషనల్‌లో యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ ఫీట్ చేశారు. భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చాహల్ రికార్డు సృష్టించాడు. చాహల్ మొత్తం 79 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

హార్దిక్ కెరీర్..

హార్దిక్ తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసి, 806 పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్ తరపున 50 వికెట్లు, 500కు పైగా పరుగులు చేసిన ఏకైక భారతీయుడు హార్దిక్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

షాహిద్ అఫ్రిది ప్రత్యేక జాబితాలో చేరిన భారత ఆల్ రౌండర్..

హార్దిక్ పాండ్యా T20 ఇంటర్నేషనల్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు, 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోని 9వ క్రికెటర్‌గా కూడా అద్భుతాలు చేశాడు. హార్దిక్ కంటే ముందు షకీబ్ అల్ హసన్, షాహిద్ అఫ్రిది, డ్వేన్ బ్రావో, జార్జ్ డాక్రెల్, మహ్మద్ నబీ, మహ్మద్ హఫీజ్, కెవిన్ ఓబ్రెయిన్ , తిసారా పెరీరా అద్భుతమైన డబుల్ బ్లాస్ట్ చేసిన లిస్టులో ఉన్నారు.

సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజ..

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. భారత్ తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 76 పరుగులు చేయగలిగాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ లభించింది. ప్రస్తుతం సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..