AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రతీకారం పాలకూర పప్పు అన్నారు.. కట్ చేస్తే.. గుండు సున్నాతో వెనుతిరిగిన ప్రీతీ ప్లేయర్!

శ్రేయాస్ అయ్యర్ IPL 2025లో పంజాబ్ కెప్టెన్‌గా తన మాజీ జట్టు KKRపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆశించాడు. కానీ రెండో బంతికే డకౌట్ కావడంతో అది పూర్తిగా ఫెయిలైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు అతనిపై ట్రోల్స్ జోరుగా పెంచారు. భారీ ధరతో కొనుగోలు చేసినప్పటికీ ప్రదర్శన లేకపోవడం వల్ల అయ్యర్‌పై ఒత్తిడి భారీగా పెరిగింది. తన మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న శ్రేయాస్ అయ్యర్‌కు ఆ అవకాశమే రాలేదు. తన డకౌట్ తర్వాత "శ్రేయాస్ అయ్యర్ KKR K లియే ఖేల్నా ఆజ్ భీ నహీ భూలా" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనను తీవ్రంగా ట్రోల్ చేశారు. KKR చేతిలో డకౌట్ మూలంగా, అయ్యర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.

Video: ప్రతీకారం పాలకూర పప్పు అన్నారు.. కట్ చేస్తే.. గుండు సున్నాతో వెనుతిరిగిన ప్రీతీ ప్లేయర్!
Pbks Captain Shreyas Iyer
Narsimha
|

Updated on: Apr 15, 2025 | 9:30 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయాస్ అయ్యర్ తన మాజీ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మైదానంలో అడుగుపెట్టాడు. అయితే, ఆ ఆశలు మొదటి ఓవర్‌లోనే చిగురించకుండానే చచ్చిపోయాయి. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రెండో బంతికే అయ్యర్ డకౌట్ కావడంతో ఆయన పంజాబ్ జట్టు ఓటమికి ఓ చేదు ప్రారంభం ఇచ్చారు. గతంలో KKR తరపున 2024 టైటిల్‌ను గెలిపించిన శ్రేయాస్ అయ్యర్, మెగా వేలానికి ముందు జట్టును విడిచిపెట్టాడు. అయితే, అతను రిటెన్షన్ కోసం కోరిన రూ. 30 కోట్ల డిమాండ్‌ను కోల్‌కతా యాజమాన్యం తిరస్కరించడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన్ని పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసి, కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, KKRపై జరిగిన మ్యాచ్ ఆయకి అత్యంత కీలకంగా మారింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు.

31వ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఈ కీలక పోరులో, నాల్గవ ఓవర్‌లో హర్షిత్ రాణా రెండో బంతికే ప్రియాంష్ ఆర్యను అవుట్ చేశాడు. రెండు బంతుల తర్వాత, అయ్యర్ స్ట్రైక్‌కు వచ్చాడు. అతనికి వెలుపల పిచ్ అయిన ఒక బంతిని హర్షిత్ పంపగా, అయ్యర్ దానిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ, అది విజయవంతం కాలేదు. బంతి బ్యాట్ యొక్క వెలుపలి భాగాన్ని మాత్రమే తాకి, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు వేగంగా ఎగిరింది. అక్కినుండి రమణ్‌దీప్ సింగ్ హెడ్-ఫస్ట్ డైవ్ చేస్తూ భూమికి అతి దగ్గరగా అద్భుతమైన క్యాచ్ పట్టి అయ్యర్‌ను పెవిలియన్‌కి పంపాడు. ఈ అవుట్ అనంతరం అయ్యర్ కేవలం రెండు బంతుల్లో డకౌట్ కావడంతో, అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

తన మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న శ్రేయాస్ అయ్యర్‌కు ఆ అవకాశమే రాలేదు. తన డకౌట్ తర్వాత “శ్రేయాస్ అయ్యర్ KKR K లియే ఖేల్నా ఆజ్ భీ నహీ భూలా” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనను తీవ్రంగా ట్రోల్ చేశారు. KKR చేతిలో డకౌట్ మూలంగా, అయ్యర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. గత కాలంలో గొప్ప విజయాలు సాధించినప్పటికీ, గత జట్టు ఎదుట అతను చూపిన ప్రదర్శన అభిమానులను నిరాశపరిచింది. ఈ ఘట్టం అయ్యర్‌కు తగిన పాఠంగా మారుతుందా లేక మరింత విమర్శలు ఎదుర్కొంటాడా అన్నది ముందున్న మ్యాచ్‌లపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..