IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

ఆర్సీబీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ విజయం సాధించింది. గుజరాత్ 205 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ సులువుగా చేధించింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి సుదర్శన్ సెంచరీ చేయగా.. ఆర్సీబీ నుంచి కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా
Rcb

Updated on: Apr 24, 2026 | 11:14 PM

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి సాయి సుదర్శన్ 58 బాల్స్‌కు సెంచరీ చేసి మంచి స్కోర్ అందించాడు. అయితే గుజరాత్ ఓటమి పాలవ్వడంతో అతడి సెంచరీ వృథా అయినట్లు అయింది.

Follow Us