Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: టాస్ గెలిచిన పాక్.. అందరి చూపు 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్‌పైనే

India U19 vs Pakistan U19, 3rd Match, Group A: అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను తొమ్మిదోసారి గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో, ఐపీఎల్ 2025 మెగా వేలంలో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది.

IND vs PAK: టాస్ గెలిచిన పాక్.. అందరి చూపు 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్‌పైనే
Ind U19 Vs Pak U19
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2024 | 10:57 AM

IND vs PAK: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ పొందింది. అయితే, ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నవంబర్ 29న ఐసీసీ సమావేశం జరిగింది.

ఆసియా కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ పోరు..

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బిసిసిఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మధ్య ఖచ్చితంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈరోజు (నవంబర్ 30) క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్థాన్ మధ్య మరో పోరు జరుగుతోంది. ఈరోజు అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో పోటీపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌, జపాన్‌, ఆతిథ్య యూఏఈతో పాటు భారత్‌ గ్రూప్‌-బిలో నిలిచింది. కాగా డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ గ్రూప్-ఎలో ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 6న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 8న ఫైనల్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియంలలో ఈ టోర్నీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అందరి దృష్టి 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే..

మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిదోసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ముందుగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పటిష్ట ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో, ఐపీఎల్ 2025 మెగా వేలంలో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది.

జట్లు:

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ అమన్ (కెప్టెన్), హర్వాన్ష్ సింగ్ (కీపర్), నిఖిల్ కుమార్, కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, మహ్మద్ ఈనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహా.

పాకిస్థాన్ U19 (ప్లేయింగ్ XI): షాజైబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, సాద్ బేగ్(కెప్టెన్, కీపర్), ఫర్హాన్ యూసఫ్, ఫహమ్-ఉల్-హక్, మహ్మద్ రియాజుల్లా, హరూన్ అర్షద్, అబ్దుల్ సుభాన్, అలీ రజా, ఉమర్ జైబ్, నవీద్ అహ్మద్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..