AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడే భారత జట్టుపై మొదటి నుంచి సందేహాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారత బోర్డు తన నిర్ణయాన్ని అధికారికంగా ఐసీసీకి తెలియజేసింది. ఐసిసి కూడా బిసిసిఐ నిర్ణయం గురించి పాకిస్తాన్ బోర్డుకి తెలియజేసింది. ఆ తర్వాత పిసిబి ప్రభుత్వంతో మాట్లాడుతోంది.

IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్
Ind Vs Pak Ct 2025
Venkata Chari
|

Updated on: Nov 11, 2024 | 8:10 AM

Share

Champions Trophy 2025: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే చర్చ జరగుతోంది. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు మాత్రం మరింత జఠిలంగా తయారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా, రెండు జట్లూ ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మారుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్లలో కూడా రెండు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం, ఇప్పుడు ప్రతిష్టంభనకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. టీమిండియాను పాక్ పంపేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిరాకరించిన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా మొండి వైఖరి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ మీడియా కథనాల ప్రకారం, భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకపోతే, రాబోయే ఏ టోర్నీలో టీమిండియాతో పాకిస్తాన్ ఆడదు.

పాకిస్థాన్‌కు సందేశం..

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే, అందులో టీమిండియా పాల్గొనడంపై మొదటి నుంచి సందేహం ఉంది. భారత జట్టు గత 16-17 సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పాకిస్థాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిందని బీసీసీఐ ఇటీవల ఐసీసీకి ఇమెయిల్ ద్వారా తెలిపింది. ఇప్పుడు ఐసీసీ భారత బోర్డు ఈ వైఖరి గురించి పాకిస్తాన్ బోర్డుకి ఇమెయిల్‌లో తెలియజేసింది.

ఇకపై భారత్‌తో మ్యాచ్‌లు ఆడం: పాకిస్థాన్ హెచ్చరిక..

భారత క్రికెట్ బోర్డు నిర్ణయంపై ఐసీసీ నుంచి తమకు సమాచారం అందిందని పీసీబీ నవంబర్ 10 ఆదివారం తెలిపింది. ఐసీసీ నుంచి పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ మెయిల్ పంపామని, ప్రభుత్వం నుంచి సలహాలు కోరామని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు మించి పాకిస్థాన్ బోర్డు ఏమీ చెప్పలేదు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పాక్ జర్నలిస్ట్ ఫైజాన్ లఖానీ, ‘X’ లో ఒక పోస్ట్‌లో భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే వరకు, రాబోయే ఏ టోర్నమెంట్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించదని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాడు. ఆ టోర్నీలోని నాకౌట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడితే, ఆ మ్యాచ్‌ని కూడా పాక్ జట్టు ఆడేందుకు నిరాకరిస్తుందని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!