Pakistan: బిర్యానీ వివాదానికి తెరలేపిన పాకిస్తాన్..! వాళ్ల కోసం 27 లక్షలు ఖర్చు చేసిందట..

Pakistan: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ భద్రతా కారణాలతో పర్యటన రద్దు చేసుకుంది.

Pakistan: బిర్యానీ వివాదానికి తెరలేపిన పాకిస్తాన్..! వాళ్ల కోసం 27 లక్షలు ఖర్చు చేసిందట..
Pak Vs Nz
Follow us

|

Updated on: Sep 21, 2021 | 5:34 PM

Pakistan: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ భద్రతా కారణాలతో పర్యటన రద్దు చేసుకుంది. ఈ విషయం పెద్ద వివాదానికి కారణమైంది. న్యూజిలాండ్ మోసం చేసినట్లు పాకిస్థాన్ ఆరోపిస్తోంది. కానీ ఇప్పుడు మరో విషయం తెరమీదకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం న్యూజిలాండ్ జట్టు ఎనిమిది రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉంది. అప్పుడు బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు అయినట్లు పాకిస్తాన్ ఆరోపిస్తుంది.

న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌లోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆటగాళ్ల భద్రత కోసం ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ పోలీసులను ఇక్కడ మోహరించారు. దీని కింద 500 మంది పోలీసులు హోటల్‌లో భద్రతా విధులు నిర్వహించారు. ఇందులో ఐదుగురు ఎస్పీలు కొంతమంది ఇతర అధికారులు ఉన్నారు. ఈ పోలీసుల భోజనం ఖర్చు రూ.27 లక్షలు అయినట్లు హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. సెక్యూరిటీగా మోహరించిన పోలీసులకు రోజుకు రెండుసార్లు భోజనం అందించాలని అందులో భాగంగా బిర్యానీ కూడా పెట్టామని వారు తెలిపారు. బిల్లు ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Biryani

Biryani

అయితే ఈ బిల్లు నిలిపివేశారు. ఇది ఇంకా పాస్ కాలేదు. అంతేకాదు కివీస్‌ ఆటగాళ్లను రక్షించడానికి బోర్డర్ కాన్స్టాబ్యులరీ సిబ్బందిని కూడా నియమించారు. వారి భోజన బిల్లు ఇంకా రాలేదు. అవి విడిగా వస్తాయి.18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. అందరు కొత్తవారే. కానీ క్వారంటైన్, ప్రాక్టీస్ తర్వాత మ్యాచ్ జరగాల్సిన రోజు పర్యటన రద్దు చేశారు. తమకు బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్ ఆరోపించింది. పర్యటన రద్దుపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కివీ ఆటగాళ్లకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయో కూడా చెప్పలేదని బోర్డు తెలిపింది.

Mulugu MLA Seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Thamannaah: ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న మిల్కీబ్యూటీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన తమన్నా..

Nivetha Pethuraj: నాచురల్ బ్యూటీతో ఫాన్స్ ని ఆకట్టుకుంటున్న నివేథా పేతురాజ్ లేటెస్ట్ పిక్స్..

Latest Articles
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్