వాడొక డమ్మీ కెప్టెన్.. టీంను సర్వనాశనం చేశాడు.. బాబర్ ఆజంపై మాజీ ప్లేయర్ సంచలన్ వ్యాఖ్యలు..

Pakistan Cricket Crisis: పాకిస్తాన్ క్రికెట్ టెస్టుల్లో వరుస ఓటములతో తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు ఓటముల తర్వాత పీసీబీ ఏకంగా 7గురు ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్‌ను స్వదేశానికి పంపింది. ఈ పరిణామాలపై మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను "డమ్మీ కెప్టెన్" అంటూ ఏకిపారేశాడు. అలాగే, పీసీబీ నిర్ణయాలను ప్రశ్నించారు.

వాడొక డమ్మీ కెప్టెన్.. టీంను సర్వనాశనం చేశాడు.. బాబర్ ఆజంపై మాజీ ప్లేయర్ సంచలన్ వ్యాఖ్యలు..
Rashid Latif Comments On Babar Azam Captaincy

Updated on: Sep 07, 2026 | 7:25 AM

Pakistan Cricket Crisis: పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో వరుస పరాజయాలతో పాక్ జట్టు అష్టకష్టాలు పడుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 2 టెస్టుల్లో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. మరో టెస్ట్‌లోనూ జట్టు ఫైట్ ఇస్తుందన్న నమ్మకం లేకుండా పోయిందంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. రెండో టెస్ట్‌లో దారుణ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర నిర్ణయాలు తీసుకుంది.

జట్టులో ఏకంగా 7గురు ఆటగాళ్లను స్వదేశానికి పిలిపించింది. అంతేకాకుండా, కోచింగ్ స్టాఫ్‌పైనా వేటు వేసింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను వెంటనే స్వదేశానికి పంపింది. ఇదే సమయంలో సెలెక్టర్ మిస్బావుల్ హక్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. చీఫ్ సెలెక్టర్ ఆఖిబ్ జావేద్‌ను కూడా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ క్రికెట్‌లో నెలకొన్న ఈ ప్రకంపనలపై మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్రంగా స్పందించారు.

ఎక్కువమంది చదివినది: Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇవి కూడా చదవండి

కోచింగ్ స్టాఫ్‌ను మొదట ఇంగ్లండ్‌కు ఎందుకు పంపారు, మళ్ళీ ఇప్పుడు స్వదేశానికి ఎందుకు పిలిపించారని రషీద్ లతీఫ్ ప్రశ్నించారు. రిమోట్ కంట్రోల్‌తో పాకిస్తాన్ జట్టును పీసీబీ నడపాలనుకుంటుందేమో అని ఆయన పీసీబీపై సెటైర్ వేశారు. పీసీబీ తీసుకుంటున్న నిర్ణయాలేవీ తనకు అర్థం కావడం లేదని రషీద్ లతీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నెక్స్ట్ టార్గెట్ బాబర్ ఆజమా?” అంటూ కెప్టెన్ తీరును కూడా తప్పుబట్టారు.

ఒక్కసారిగా జట్టు నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లను తీసివేసినప్పుడు కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ రాజీనామా చేసి ఉంటే బాగుండేదని లతీఫ్ అభిప్రాయపడ్డారు. బాబర్ ఆజమ్ ప్లేస్‌లో తాను ఉంటే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేవాడినని స్పష్టం చేశారు. బాబర్ ఆజమ్ ఒక డమ్మీ కెప్టెన్‌గా మారిపోయాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాయపడిన ఇమాముల్ హక్‌ను స్వదేశానికి పంపడంలో అర్థముందని, కానీ మరో ఆరుగురిని ఎందుకు పంపారనేదే అసలు ప్రశ్న అని రషీద్ లతీఫ్ అడిగారు. కోచింగ్ స్టాఫ్‌కు, జట్టులో చోటు కోల్పోయిన ప్లేయర్లకు బాబర్ ఆజమ్ మద్దతుగా నిలిచి ఉండాల్సిందని ఆయన సూచించారు. అయినప్పటికీ, ఇలాంటి డమ్మీ కెప్టెన్లే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అవసరం అని రషీద్ లతీఫ్ ఫైర్ అయ్యారు.

ఎక్కువమంది చదివినది: Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?

మరోవైపు, జట్టు నుంచి తప్పించిన సీనియర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్, సల్మాన్ ఆఘాపై వేటుకు వారి ప్రవర్తన కూడా కారణమనే చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో రిజ్వాన్ కేవలం 61 పరుగులే సాధించి, షాట్ల ఎంపికపై విమర్శలు ఎదుర్కొన్నారు. గాయం పేరుతో లార్డ్స్ టెస్టులో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా ఇమాముల్ హక్ బ్యాటింగ్‌కు దిగలేదు. మొదటి టెస్ట్‌లో జట్టును నడిపించిన సల్మాన్ ఆఘా, రెండో టెస్ట్‌లో తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత మూడో టెస్ట్‌కు ముందే స్వదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని, కోచ్ మైక్ హెసెన్ సూచనలతోనే వీరిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా, పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం వివాదాలకు కేంద్రంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us