AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బాబోయ్.. ఇకపై ఆ టెస్టులు మాకొద్దు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం..

Pink Ball Test: ఇప్పటివరకు పింక్ బాల్‌తో ఆడిన అన్ని టెస్టులు కేవలం 2-3 రోజుల్లోనే ముగిశాయి. ప్రజలు 4 నుంచి 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. కానీ, అది త్వరగా ముగిసిపోవడంతో.. పింక్ బాల్ టెస్టులపై ఆసక్తి లేకుండాపోతోంది. దీంతో భారత్‌లో దీన్ని నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ చేసిన ఈ ప్రకటన తర్వాత టీమ్‌ఇండియా పింక్‌ బాల్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడడం అనుమానంగా మారింది. ప్రస్తుతం భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ డిసెంబర్ 26 నుంచి 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్టులు ఎర్ర బంతితో నిర్వహించనున్నారు.

Team India: బాబోయ్.. ఇకపై ఆ టెస్టులు మాకొద్దు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం..
Pink Ball Test
Venkata Chari
|

Updated on: Dec 11, 2023 | 1:15 PM

Share

Day-Night Test: ఇకపై భారత్‌లో డే-నైట్ టెస్టు మ్యాచ్‌లు జరగడం అనుమానమే. పింక్ బాల్‌తో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడడం మనకు తెలిసిందే. ఇకపై ఈ మ్యాచ్‌లను భారత మైదానంలో నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. BCCI ఇకపై డొమెస్టిక్ సీజన్‌లో పురుషుల క్రికెట్ లేదా మహిళల ఈవెంట్‌లలో డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించదు. పింక్ బాల్ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

నివేదిక ప్రకారం, బీసీసీఐ సెక్రటరీ జైషా విలేకరులతో మాట్లాడుతూ పింక్ బాల్ టెస్ట్‌పై భారత బోర్డు ఆసక్తి చూపడం లేదని, ఇది 4 లేదా 5 రోజులకు బదులుగా 2 నుంచి 3 రోజుల్లో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. పింక్ బాల్ టెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అన్ని విధాలా కృషి చేసిందని జైషా అన్నారు.

ఇప్పటివరకు గులాబీ బంతితో ఆడిన టెస్టులన్నీ కేవలం 2-3 రోజుల్లోనే ముగిశాయి. ప్రజలు 4 నుంచి 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. కానీ, అది త్వరగా ముగుస్తుంది. దీంతో భారత్‌లో దీన్ని నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పింక్ బాల్ టెస్ట్ చివరిగా ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఆ తర్వాత మరే ఇతర దేశం దీనికి ఆతిథ్యం ఇవ్వలేదు.

టీమ్ ఇండియా ఇప్పటివరకు 4 పింక్ బాల్ టెస్టులు ఆడగా, 3 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో భారత్ చివరి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది కూడా 3 రోజుల్లో ముగిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు 2021లో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు ఒకే ఒక్క పింక్ బాల్ టెస్టు ఆడింది. క్వీన్స్‌లాండ్‌లో జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది.

బీసీసీఐ సెక్రటరీ చేసిన ఈ ప్రకటన తర్వాత టీమ్‌ఇండియా పింక్‌ బాల్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడడం అనుమానంగా మారింది. ప్రస్తుతం భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ డిసెంబర్ 26 నుంచి 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్టులు ఎర్ర బంతితో నిర్వహించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్