AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohsin Naqvi : మీమేమైనా బిచ్చగాళ్లమా.. ఇకపై భారత్ ను అడుక్కునేదే లేదు.. ఈ ఓవరాక్షన్ ఏందయ్యా బాబు!

సెప్టెంబర్ 9 నుంచి ఏసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఇందులో క్రికెట్ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఇటీవల, బహుళజాతి టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Mohsin Naqvi : మీమేమైనా బిచ్చగాళ్లమా.. ఇకపై భారత్ ను అడుక్కునేదే లేదు.. ఈ ఓవరాక్షన్ ఏందయ్యా బాబు!
Mohsin Naqvi
Rakesh
|

Updated on: Aug 24, 2025 | 7:15 PM

Share

Mohsin Naqvi : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం మల్టీనేషనల్ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో ఆడటానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

భారత్‌తో క్రికెట్ సంబంధాల గురించి పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇకపై భారత్‌తో ఆడేందుకు పాకిస్తాన్ అడుక్కోబోదని, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు సమాన స్థాయిలో ఉంటాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసియా కప్ 2025కు ముందు రావడం గమనార్హం.

లాహోర్‌లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నక్వీ మాట్లాడుతూ.. “భారత్‌తో చర్చలు జరిగేటప్పుడు అవి సమాన స్థాయిలో ఉండాలని మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఇకపై చర్చల కోసం మేము ఎవరినీ అడగం. ఆ రోజులు గడిచిపోయాయి. ఏది జరిగినా అది సమానత్వ ప్రాతిపదికన జరుగుతుంది” అని అన్నారు. నక్వీ వ్యాఖ్యలను చాలా మంది ఈ అహంకారం పనికి రాదని అంటున్నారు.

చాలా ఏళ్లుగా భారత జట్టు పాకిస్తాన్‌కు పర్యటనకు వెళ్లలేదు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను పాకిస్తాన్‌లో ఆడటానికి భారత్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో నక్వీ ఐసీసీ, బీసీసీఐలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత్, పాకిస్తాన్ జట్లు ఒకరికొకరు తటస్థ వేదికలపై ఆడాలని ఈ ఏడాది మొదట్లో నిర్ణయించుకున్నాయి. రాబోయే మహిళల ప్రపంచ కప్‌లో కూడా ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు భారత్‌కు బదులుగా శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..