
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ కూడా ఫైనల్స్ వైపు అడుగులు వేసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో లక్నో సూపర్జెయింట్పై విజయం సాధించింది. ఇప్పుడు క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. దీంతో రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎందుకు పేరుగాంచాడో మరోసారి నిరూపించుకున్నాడు.
ముంబై ఇండియన్స్కు టోర్నీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. లీగ్ దశలో సగానికి పైగా మ్యాచ్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. కానీ, ఇక్కడ నుంచి జట్టు బలమైన పునరాగమనం చేసి తదుపరి 8 మ్యాచ్లలో 6 గెలిచింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్కు రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ గెలిచే అవకాశానికి దగ్గరైంది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ముంబై ఇండియన్స్ సాధించిన ఈ విజయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పెద్ద హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2013 మధ్య సీజన్లో రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్కు బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్సీ తొలి సీజన్లోనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను విజేతగా నిలిపాడు.
ఆ తర్వాత కెప్టెన్గా రోహిత్ శర్మ వెనుదిరిగి చూడలేదు. 2014లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు వెళ్లగలిగింది. 2015, 2017, 2019, 2020లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
అయితే గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పునరాగమనం చేసి టైటిల్ దిశగా అడుగులు వేసింది. ముంబై ఇండియన్స్కు రికార్డు స్థాయిలో ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..