
ఐపీఎల్లో ధోని పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. బ్యాటింగ్, వికెట్కీపర్గా ఎన్నో పెద్ద రికార్డులు సాధించాడు. ధోనీ కెప్టెన్సీలోనూ భారీ రికార్డులు సృష్టించాడు. కాగా, IPL 2023 మొదటి మ్యాచ్లో అతను చాలా ప్రత్యేకమైన ఫీట్ను సాధించాడు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ పడిన వెంటనే, ఐపీఎల్లో అత్యధిక వయసు కలిగిన కెప్టెన్గా ధోనీ నిలిచాడు. ప్రస్తుతం ధోని వయస్సు 41 ఏళ్ల 249 రోజులు. ఈ లీగ్కి అత్యంత వయో వృద్ధ కెప్టెన్గా నిలిచాడు.
41 ఏళ్ల 249 రోజుల వయసులో కెప్టెన్సీ చేసిన రాజస్థాన్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్ రికార్డును ధోనీ బద్దలు కొట్టాడు. వార్న్ 2011 వరకు రాజస్థాన్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డు ధోనీ పేరిట నమోదైంది.
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోనీ.. అత్యధిక వయసులో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ధోనీ 40 ఏళ్ల 70 రోజుల వయసులో చెన్నైని ఐపీఎల్ ఛాంపియన్గా మార్చాడు. 2021లో ధోనీ చెన్నైని నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్గా మార్చాడు.
ఐపీఎల్లో అత్యంత వృద్ధ కెప్టెన్గా ధోనీ గుర్తింపు పొందాడు. అయితే ఐదోసారి తన జట్టును ఐపీఎల్లో ఛాంపియన్గా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సీజన్ ఈ అనుభవజ్ఞుడికి చివరి సీజన్ కావచ్చని నమ్ముతారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..