AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Root: సచిన్ టెండూల్కర్ లెజెండరీ క్లబ్‌లోకి జో రూట్.. పాంటింగ్‌ను సమం చేస్తూ సంచలన రికార్డు

Joe Root: పాకిస్థాన్‌తో లార్డ్స్ టెస్టులో బరిలోకి దిగిన జో రూట్ 168వ టెస్టు మ్యాచ్ పూర్తి చేసి రికీ పాంటింగ్, స్టీవ్ వా రికార్డును సమం చేశాడు. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. 200 టెస్టుల సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డుపై కూడా రూట్ కన్నేశాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 14,184 పరుగులు ఉన్నాయి.

Joe Root: సచిన్ టెండూల్కర్ లెజెండరీ క్లబ్‌లోకి జో రూట్.. పాంటింగ్‌ను సమం చేస్తూ సంచలన రికార్డు
Sachin Tendulkar,
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 12:13 PM

Share

Joe Root: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టడమే తడవుగా ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అరుదైన మైలురాయిని అందుకోవడంతో పాటు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచారు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ జో రూట్ కెరీర్‌లో 168వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో ఆయన ఆస్ట్రేలియా పూర్వ దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్, స్టీవ్ వాలు ఆడిన 168 టెస్టుల రికార్డును సమం చేశారు. అంతేకాకుండా తన తోటి ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ఆడిన 167 టెస్టుల రికార్డును దాటేసి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో టాప్-5లోకి దూసుకెళ్లారు.

అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విషయంలో పాంటింగ్, స్టీవ్ వా సరసన చేరినప్పటికీ, సాధించిన పరుగుల విషయంలో రూట్ వారి కంటే చాలా ఎత్తులో ఉన్నారు. జో రూట్ ఇప్పటివరకు 14,184 పరుగులు చేయగా, రికీ పాంటింగ్ 13,378 పరుగులు, స్టీవ్ వా 10,927 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం రూట్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారిలో కేవలం జేమ్స్ అండర్సన్ (188 మ్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ (200 మ్యాచ్‌లు) మాత్రమే ఉన్నారు.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా భారత రత్న సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సచిన్ మైలురాయిని దాటడానికి రూట్ మరో 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ జట్టు ప్రతి సంవత్సరం ఆడే టెస్టు మ్యాచ్‌ల సంఖ్యను బట్టి చూస్తే, ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే రాబోయే కొన్నేళ్ళలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులను కూడా రూట్ చెరిపివేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజున లార్డ్స్ మైదానంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 36 పరుగులకే టాప్-3 వికెట్లను కోల్పోగా, జో రూట్ కూడా 4 పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం జార్డన్ కాక్స్ (55), జేమీ స్మిత్ (61) అర్ధ సెంచరీలతో ఆదుకోవడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు, మహమ్మద్ అలీ 3 వికెట్లతో చెలరేగారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us