బుమ్రాకు బ్యాకప్ వచ్చేశాడుగా.. ఆ ఐపీఎల్ తోపును రంగంలోకి దింపిన గంభీర్.. ఎవరంటే?
Jasprit Bumrah Injury: టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈక్రమంలో ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్తోపాటు ఆసియా క్రీడల్లో బుమ్రా పాల్గొనడంపై ఉత్కంఠ నెలకొంది. మోకాలి గాయంతో బాధపడుతున్న బుమ్రా విషయంలో బీసీసీఐ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదంటూ మాజీ ఆటగాడు బద్రీనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

Jasprit Bumrah Injury: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు. దీంతో రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్తో పాటు 2026 ఆసియా క్రీడల్లో బుమ్రా ఆడతాడా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే మారింది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే జట్టులో బుమ్రాకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. కానీ, బుమ్రా పూర్తి ఫిట్నెస్గా ఉంటేనే బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. బుమ్రా గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జులై 16న ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలికి బలమైన దెబ్బ తగిలింది. గతంలో ఉన్న గాయం మరింత తీవ్రమైందని తెలుస్తోంది. ఆ మ్యాచ్ తర్వాత బుమ్రా మరోసారి బౌలింగ్ చేయలేదు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
కాగా, టీమిండియాలోకి బుమ్రా ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో తెలియదు. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) సెలెక్టర్లు ప్రిన్స్ యాదవ్ను ‘బ్యాకప్’గా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 10న ఢిల్లీలో జట్టుతో చేరడానికి అనుమతి లభించాల్సి ఉంది. బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు వారం రోజుల పాటు మ్యాచ్-సిమ్యులేషన్ టెస్ట్లకు హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ బద్రీనాథ్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. బుమ్రా విషయంలో బీసీసీఐ సక్రమంగా వ్యవహరించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది జనవరిలో వెన్ను గాయానికి గురైనప్పటి నుంచి బుమ్రా పనిభారాన్ని నియంత్రించడంపై బీసీసీఐ దృష్టి సారించింది, కానీ ఫలితాలు అంత ఆకట్టుకునేలా లేదని తెలుస్తోంది. ఇందుకు జట్టు కెప్టెన్, కోచ్, సెలెక్టర్లే కారణమని బద్రీనాథ్ పేర్కొన్నాడు.
“ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. బుమ్రా ఫలానా స్థితిలో ఉన్నాడు, ఈ మ్యాచ్ ఆడగలడు, అతని శరీరం ఫలానా స్థితిలో ఉంది అని మాత్రమే సీఈఓ చెబుతారు. కేవలం కెప్టెన్, కోచ్, సెలెక్టర్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సీఓఈ కేవలం సమాచారాన్ని అందిస్తుంది. వారు సెలెక్టర్లు కాదు,” అని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పుకొచ్చాడు.
ఎక్కువమంది చదివినది: 27 ఫోర్లు, 27 సిక్స్లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!
బుమ్రాతో పాటు, భారత జట్టు ఇతర ఆటగాళ్ల గాయాలతో కూడా ఇబ్బందులో పడుతోంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ ఇలా గాయాలపాలైన లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




