IPL 2022 Auction: మొదలైన క్రికెట్ అభిమానుల పండగ.. తొలిరోజు వేలంలో ఎంతమంది ప్లేయర్లంటే?
ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి అన్ని జట్లతో పాటు ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఎవరి జట్టులో ఏ ఆటగాడు చేరనున్నాడు, ఏ ఆటగాడికి ఎంత డబ్బు దక్కనుందో..
ఐపీఎల్ మెగా వేలానికి(IPL 2022 Auction) రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి అన్ని జట్లతో పాటు ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఎవరి జట్టులో ఏ ఆటగాడు చేరనున్నాడు, ఏ ఆటగాడికి ఎంత డబ్బు దక్కనుంది, ఎవరిని లక్ వరించనుందో మరికొద్ది సేపట్లో తేలనుంది. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరగనున్న ఈ మెగా వేలానికి బెంగళూరు రెడీ అయ్యింది. అసలు మొదటి రోజు ఎంతమంది వేలంలోకి రానున్నారు. రెండో రోజు వేలంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేలం ఎక్కడ: బెంగళూరు
ఎప్పుడెప్పుడు: ఫిబ్రవరి 12, 13
మొత్తం జట్లు: ఐపీఎల్ 8 టీమ్లతో పాటు కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్తో మొత్తం 10 టీంలు వేలానికి సిద్ధమయ్యాయి.
జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య: 33 మంది
వేలంలో ఇంకెంతమంది ఉన్నారు: 60 మంది (377 మంది ఇండియన్ ప్లేయర్లు, 223 మంది విదేశీ ఆటగాళ్లు)
వేలంలో ఎంతమందిని ఎంచుకోనున్నారు: 227 మందిని గరిష్టంగా ఎంచుకోనున్నారు.
ఒక్కో టీమ్ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మందిని ఎంచుకోనున్నారు. (ఇందులో 8 మంది విదేశీయులు ఉండాలి)
ఒక్కో జట్టు ఎంత ఖర్చు చేయాలి: గరిష్టంగా ప్రతీ జట్టుకు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసే అనుమతి ఉంది. ప్లేయర్లను ఎంచుకునేందుకు కనిష్టంగా రూ. 67.5 కోట్లయినా ఉపయోగించాల్సి ఉంటుంది.
మొదటి రోజు, ఫిబ్రవరి 12న: ఈ రోజు (శనివారం) వేలంలో మొత్తం 161 మంది క్రికెటర్లను మాత్రమే వేలం వేయనున్నారు. మిగిలిన 439 మంది ఆటగాళ్లను ఆదివారం వేలం వేయనున్నారు. అయితే మొదటి రోజు అనంతరం 10 ఫ్రాంచైజీలు ఎంతమందిని ఎంచుకున్నారో ఓ క్లారిటీ వస్తుంది. దీని తరువాత రెండో రోజు మొత్తం 439 మంది ప్లేయర్లలో ఎంతమంది వేలంలోకి వస్తే బాగుంటుందో అన్ని జట్లు నిర్ణయించుకుని బీసీసీఐకి విన్నవించనున్నారు. దాంతో ఫ్రాంచైజీల కోరికమేరకు వారిని మాత్రమే వేలంలో ఉంచనున్నారు.
Also Read: IPL 2022 Auction: జట్ల నుంచి ఆటగాళ్ల వరకు.. మెగా వేలానికి సంబంధించి 10 కీలక విషయాలు..
IPL 2022 Auction, Day 1, Live: తగ్గేదేలే.! 10 జట్లు.. రూ. 561 కోట్లు.. 590 మంది క్రికెటర్లు..