Smriti Mandhana: కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్.. స్మృతి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో

|

Jun 20, 2024 | 8:04 AM

బెంగళూరు వేదికగా బుధవారం (జూన్ 19) సౌతాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ అమ్మాయిలు 4 పరుగుల తేడాతో విజయం సాధించారు . ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను మరో గేమ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 325 పరుగులు చేసింది. దీంతో మన జట్టు సులువుగా విజయం సాధిస్తుందని తేలింది.

Smriti Mandhana: కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్..  స్మృతి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో
Smriti Mandhana
Follow us on

బెంగళూరు వేదికగా బుధవారం (జూన్ 19) సౌతాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ అమ్మాయిలు 4 పరుగుల తేడాతో విజయం సాధించారు . ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను మరో గేమ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 325 పరుగులు చేసింది. దీంతో మన జట్టు సులువుగా విజయం సాధిస్తుందని తేలింది. కానీ ఆఫ్రికన్ మహిళల జట్టు తుదికంటా పోరాడారు.చివరికి 321 పరుగులకు ఆలౌటై విజయానికి 5 పరుగులు దూరంలో నిలిచిపోయారు.కాఆ ఈ మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే.. ఈ మ్యాచ్ లో సెంచరీ ఇన్నింగ్స్ ఆడి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించిన స్మృతి మంధాన.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ సత్తా చాటింది. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిందీ బ్యూటిఫుల్ క్రికెటర్. నిజానికి టీమ్ ఇండియాకు ఓపెనర్‌గా ఉన్న స్మృతి తన మెరుపు బ్యాటింగ్ తో సెంచరీలు చేయడమే పని. తన బలమైన బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియాకు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన ఘనత స్మృతికి ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో స్మృతి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. పైన చెప్పినట్లు కెరీర్‌లో తొలిసారి బౌలింగ్ చేయబోతున్న స్మృతి.. తన తొలి ఓవర్ రెండో బంతికే ఆఫ్రికా బ్యాటర్ సునే లూస్ వికెట్‌ను తీసింది.

రెండో వన్డేలో వెటరన్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. దీంతో జట్టు నిర్ణీత సమయంలో వికెట్లు తీయలేకపోయింది. అందుకే, ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. స్మృతి మంధానకు అవకాశం ఇచ్చింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో బంతిని తీసుకున్న మంధాన తన కెరీర్‌లో తొలిసారి బౌలింగ్ చేసి రెండో బంతికి వికెట్ తీసింది.వికెట్ తీయగానే మైదానం అంతా తిరుగుతూ డ్యాన్స్ చేసింది స్మృతి. స్మృతి మ్యాజిక్‌కు తోటి క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. స్మృతి తన తొలి ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసింది.

ఇవి కూడా చదవండి

స్మృతి సంబరాలు.. వీడియో ఇదిగో..

అంతకు ముందు బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడిన స్మృతి మంధాన 120 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో ఆమెకు స్మృతి అత్యుత్తమ ఇన్నింగ్స్ఇక్కడ గమనార్హం. వన్డే క్రికెట్‌లో ఆమె మునుపటి అత్యుత్తమ స్కోరు 135 పరుగులు. 2018లో దక్షిణాఫ్రికాపై ఇదే స్కోరును నమోదు చేసింది.

వరుసగా రెండో సెంచరీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..