
England vs India, 1st T20I: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు చెస్టర్-లె-స్ట్రీట్లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 80 శాతం ఉంది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 2-0 తేడాతో ఓడిపోయిన తర్వాత, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు కొత్త సీజన్ను విజయంతో ప్రారంభించాలని కోరుకుంటోంది.
సిరీస్కు ముందు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం గురించే ఎక్కువగా చర్చ జరిగింది. అయితే, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో, భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతని అరంగేట్రం గురించిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అన్నట్లుగా ఈ రోజు మ్యాచ్లోనూ వైభవ్ను ఆడించడంలేదు.
భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడగా, వాటిలో భారత జట్టు 18, ఇంగ్లాండ్ 12 గెలిచాయి. అయితే, ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉంది. అక్కడ జరిగిన తొమ్మిది మ్యాచ్లలో భారత్ నాలుగు విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ ఐదు విజయాలు సాధించింది.
భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు తొమ్మిది టీ20 సిరీస్లు ఆడాయి. వీటిలో భారత్ ఐదింటిలో విజయం సాధించగా, ఇంగ్లాండ్ మూడింటిలో గెలిచింది. ఒక సిరీస్ డ్రా అయింది. భారత్ వరుసగా చివరి ఐదు సిరీస్లను గెలుచుకుంది.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
భారత్ ప్లేయింగ్ XI: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.