Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఉత్కంఠగా భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్.. ‘బాల్-అవుట్’తో రిజల్ట్.. వీడియో చూస్తే గూస్ బంప్స్..

India vs Pakistan: 2007 ప్రపంచకప్‌లో గ్రూప్ మ్యాచ్‌లో భారత్ బాల్ అవుట్ ద్వారా పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ సమయంలో సెహ్వాగ్, ఉతప్ప, హర్భజన్ సింగ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Watch Video: ఉత్కంఠగా భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్.. 'బాల్-అవుట్'తో రిజల్ట్.. వీడియో చూస్తే గూస్ బంప్స్..
India Vs Pakistan 2007 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2022 | 12:11 PM

India vs Pakistan T20 World Cup Bowl-out On This Day: టీ20 ప్రపంచ కప్ 2007 ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఫైనల్‌కు ముందు జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ ఇదే రోజు (సెప్టెంబర్ 14) జరిగింది. అయితే, ఈ మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ బాల్ అవుట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఈ సమయంలో భారత్ తరపున రాబిన్ ఉతప్ప, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఈ సమయంలో ఉతప్ప 39 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ 20 పరుగులు చేశాడు. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున మిస్బా ఉల్ హక్ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవలేకపోయింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.

దీంతో ఫలితాన్ని బాలౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్లలోని కీలక బౌలర్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. భారత్ నుంచి తొలి రౌండ్ లో సెహ్వాగ్ బంతిని అందుకున్నాడు. తన బౌలింగ్ తో వికెట్లను పడగొట్టి తొలి విజయం అందించాడు. పాక్ నుంచి మిస్బా బంతిని అందుకుని వికెట్లను పడగొట్టలేకపోయాడు. రెండో రౌండ్‌లో టీమ్ ఇండియా బాధ్యతలను హర్భజన్‌కు అప్పగించారు. అతని బంతి స్టంప్‌లను తాకి వికెట్ కీపర్‌కు చేరింది. కాగా ఉమర్ గుల్ పాకిస్థాన్ తరపున బంతిని విసిరేందుకు వచ్చాడు. అతను తన బంతితో వికెట్లను పడగొట్టలేకపోయాడు. ఇక మూడో రౌండ్‌లో ఉతప్ప భారత్‌కు బాధ్యతలు అప్పగించాడు. అతని బంతి స్టంప్‌లను తాకి వికెట్ కీపర్‌కు చేరింది. కాగా, షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ నుంచి బంతిని విసిరేందుకు వచ్చాడు. అతని బంతి కూడా మిస్ అయింది. దీంతో టీమిండియా 3-0తో విజయం సాధించింది.