INDW vs PAKW: సత్తా చాటిన భారత బౌలర్లు.. తక్కువ స్కోర్కే పాక్ పరిమితం..
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్కు పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున నిదా దార్ అత్యధికంగా 28 పరుగులు చేసింది. భారత్ తరపున అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు. ఆశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో వికెట్ తీశారు.
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్కు పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
పాకిస్థాన్ తరపున నిదా దార్ అత్యధికంగా 28 పరుగులు చేసింది. భారత్ తరపున అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు. ఆశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో వికెట్ తీశారు.
సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే, టీమిండియా ఈ మ్యాచ్ని ఎలాగైనా గెలవాటీలి. ఎందుకంటే, మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్తో జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ టోర్నీలో పాకిస్థాన్పై ఆధిపత్యం ప్రదర్శించడం భారత్కు విశేషం. టీ-20 ప్రపంచకప్లో ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 5 మ్యాచ్లు గెలిచింది. పాకిస్థాన్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..