AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 3rd ODI: సెంచరీలతో చెలరేగిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ.. మరో సారి భారీ స్కోర్ చేసిన భారత్.. కివీస్ టార్గెట్ ఎంతంటే.?

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత టీమ్ తన బ్యాటింగ్ సత్తాను చాటి చెప్పింది. ఓపెనర్లుగా వచ్చిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో

IND vs NZ 3rd ODI: సెంచరీలతో చెలరేగిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ.. మరో సారి భారీ స్కోర్ చేసిన భారత్.. కివీస్ టార్గెట్ ఎంతంటే.?
Ind Vs Nz 3rd Odi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 24, 2023 | 5:48 PM

Share

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత టీమ్ తన బ్యాటింగ్ సత్తాను చాటి చెప్పింది. ఓపెనర్లుగా వచ్చిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో పాటు టెయిలెండర్స్ కూడా కొంతమేర రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్  9వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ టార్గెట్ 386. ముందుగా టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను శుభమాన్ గిల్, రోహిత్ శర్మతో ప్రారంభించింది. ఓపెనర్లుగా వచ్చిన గిల్(78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు).. రోహిత్ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకాలతో రాణించారు.

అయితే వీరి ధాటికి భారత్ స్కోర్ ఒక దశలో కేవలం 24.1 ఓవర్లలో 200 మార్కును అందుకుంది. ఈ క్రమంలో భారత్ 450 పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమయింది. ఈ క్రమంలో కోహ్లీ(35) పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా(54) హాఫ్ సెంచరీతో పరుగులను పెంచాడు. పాండ్యాతో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా 25 పరుగులతో స్కోర్ 350 దాటేలా చేశారు. ఆ విధంగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. ఇకపోతే న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, టిక్నర్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే బ్రేస్‌వెల్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

ఇవి కూడా చదవండి

విశ్వరూపం చూపించిన రోహిత్

రోహిత్ శర్మ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉండడమేకాక ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే భారీ స్కోర్లను చేయడంలో మాత్రం రోహిత్ విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ చూస్తే చూడాలని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు రోహిత్ తెర దించాడు. వన్డేల్లో చివరిసారిగా ఎప్పుడో 2020 జనవరి 19న సెంచరీ బాదిన రోహిత్.. మళ్లీ ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల నిరీక్షణ అనంతరం రోహిత్ మళ్లీ వన్డేల్లో శతకంతో మెరిశాడు. దీంతో అతని అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్