India vs England, 1st ODI: టాస్ గెలిచిన రోహిత్.. ప్లేయింగ్ XI నుంచి కోహ్లీ ఔట్.. ఇద్దరు ఆల్‌ రౌండర్లకు చోటు..

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఓవల్‌లో ఇరుజట్ల మద్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

India vs England, 1st ODI: టాస్ గెలిచిన రోహిత్.. ప్లేయింగ్ XI నుంచి కోహ్లీ ఔట్.. ఇద్దరు ఆల్‌ రౌండర్లకు చోటు..
Ind Vs Eng 1st Odi Playing Xi

Updated on: Jul 12, 2022 | 5:14 PM

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఓవల్‌లో ఇరుజట్ల మద్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. టీ20లో భారత్ చాలా దూకుడు బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరించింది. వన్డేల్లోనూ ఈ ఫిలాసఫీని కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు చేదువార్త వచ్చింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గజ్జల్లో గాయంతో దూరమయ్యాడు. టీమిండియా ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, నలుగురు బౌలర్లతో బరిలోకి దిగనుంది.

2014లో ఇంగ్లండ్‌లో జరిగిన చివరి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..

ఇవి కూడా చదవండి

వన్డే క్రికెట్‌లో 8 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌తో సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు ఉంది. 2014లో చివరిసారిగా అక్కడ వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. అప్పుడు భారత్ 3-1తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. దీని తర్వాత 2018లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-2తో ఓడిపోయింది. 2019 ప్రపంచ కప్‌లో రెండు జట్ల మధ్య 1 మ్యాచ్ జరిగింది. అందులోనూ ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

ఇరు జట్లు..

భారత (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

Loading...
Unable to load recommendations.
Follow Us