AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: 16 ఏళ్ల కుంబ్లే ప్రతీకారం.. రోహిత్ తీర్చిన వేళ.. అదేంటో తెలుసా?

2008లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అదే సమయంలో, టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 328 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

IND vs SA: 16 ఏళ్ల కుంబ్లే ప్రతీకారం.. రోహిత్ తీర్చిన వేళ.. అదేంటో తెలుసా?
Ind Vs Sa 2nd Test Revange
Venkata Chari
|

Updated on: Jan 03, 2024 | 9:13 PM

Share

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను తొలిరోజు 55 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై ఏ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. దీంతో 16 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది.

కేప్ టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌ను కేవలం 23.2 ఓవర్లలోనే ముగించింది. అంటే మ్యాచ్ తొలి సెషన్‌లోనే భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. గతంలో 2008లో భారత జట్టుపై దక్షిణాఫ్రికా కూడా ఇదే ఫీట్ సాధించింది. 2008 భారత పర్యటనలో, దక్షిణాఫ్రికా అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియాను 76 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కూడా మ్యాచ్ తొలి సెషన్‌లోనే భారత్‌ను చిత్తు చేసింది.

2008లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అదే సమయంలో, టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 328 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

టీమిండియా గతంలో దక్షిణాఫ్రికాలో 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇందులో భారత్ 7 సిరీస్‌లను కోల్పోగా, 1 సిరీస్ డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న ఏకైక భారత కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నిలిచాడు. కానీ, కేప్ టౌన్ టెస్టులో శుభారంభం అందించిన భారత జట్టు దక్షిణాఫ్రికాలో రెండోసారి సిరీస్‌ను డ్రా చేసుకునే సువర్ణావకాశాన్ని అందుకుంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us