IND vs PAK, T20 World Cup 2021: వరుణ్ ఔట్.. హార్ధిక్ ఇన్..! టీమిండియా ప్లేయింగ్ XIపై TV9తో సీనియర్ సెలెక్టర్
పాకిస్తాన్పై హార్దిక్ పాండ్యా ఆడతాడో లేదా అనే ప్రశ్నలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో వెటరన్ సెలెక్టర్ టీమిండియా ప్లేయింగ్ XIతో మాట్లాడారు.
Team India Playing XI vs Pak: పాకిస్థాన్పై టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉంటుంది? జట్టు కలయిక ఎలా ఉంటుంది? కెప్టెన్ కోహ్లీ ఎవరితో బరిలోకి దిగనున్నాడు? హార్దిక్ పాండ్యా ఆడతాడా.. లేదా? భారతదేశపు వెటరన్ సెలెక్టర్ సబా కరీమ్ TV9 హిందీతో ప్రత్యేక సంభాషణలో ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అందిచారు. సబా కరీమ్ టీమిండియా ప్లేయింగ్ XIకి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు అందిచాడు. పాకిస్థాన్తో ఆడనున్న టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేశాడు. భారత మాజీ సెలెక్టర్ తన ప్లేయింగ్ ఎలెవన్లో వరుణ్ చక్రవర్తికి చోటు లభించదని పేర్కొన్నాడు. వార్మ్-అప్ మ్యాచ్లో టీమిండియా తయారు చేసిన గేమ్ ప్లాన్కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించాడు.
పాకిస్థాన్కి వ్యతిరేకంగా హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా అంటూ ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి. భారత్ ఆటగాడు గౌతమ్ గంభీర్ నుంచి పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ వరకు బౌలింగ్ చేయకుంటే ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కదన్న మాట వినిపిస్తోంది. కానీ, సబా కరీం ప్రకారం, హార్దిక్ పాండ్య జట్టులో స్థానం ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా తన పవర్ హిట్టింగ్ నైపుణ్యాలతో టీమిండియాలో చోటు దక్కించుకుంటాడని భారత వెటరన్ సెలెక్టర్ తెలిపాడు. హార్దిక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు పవర్ హిట్టర్లు భారత ప్లేయింగ్ XIలో ఉంటారని సబా కరీం వెల్లడించాడు.
6గురు బ్యాట్స్మెన్స్, 5గురు బౌలర్లతో భారత్ 6 గురు బ్యాట్స్మెన్లు, 5 గురు బౌలర్ల కలయికతో పాక్పై టీమిండియా బరిలోకి దిగుతుందని సబా కరీమ్ అన్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్లుగా వస్తారు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో రానున్నాడు. నాల్గవ స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉంటాడు. అయితే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య 5, 6 స్థానంలో బరిలోకి దిగుతారని తెలిపాడు.
జట్టులో చోటు దక్కిన వరుణ్ చక్రవర్తి..? టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ ఏమిటి? దీనికి ప్రతిస్పందనగా, సబా కరీమ్ 5 స్పెషలిస్ట్ బౌలర్ల పేర్లను వెల్లడించారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న వరుణ్ చక్రవర్తి పేరును మాత్రం పేర్కొనలేదు. సబా కరీం మాట్లాడుతూ, “జడేజా, అశ్విన్ ఇద్దరు భారత ప్రధాన స్పిన్నర్లు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చేతిలో ఫాస్ట్ బౌలింగ్ కమాండ్ నడవనుంది. వరుణ్ చక్రవర్తిని జట్టులో చేర్చకపోవడంపై సబా కరీం మాట్లాడుతూ, “వార్మప్ మ్యాచ్లలో పవర్ప్లేలలో అశ్విన్ బౌలింగ్ చేయడంతో ప్లేయింగ్ ఎలెవన్లో భాగం అయ్యాడని, అందుకే వరుణ చక్రవర్తికి స్థానం లేదని” ఆయన అన్నాడు. వార్మప్లో వరుణ్ చక్రవర్తి ఎక్కువగా బౌలింగ్ చేయలేదని తెలిపాడు. వరుణ్ ఆస్ట్రేలియాపై కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇవి చాలా ఖరీదైనవిగా నిరూపించబడింది. అదే సమయంలో, అశ్విన్ ఆర్థికంగా బౌలింగ్ చేసి, వికెట్లు కూడా తీశాడు. సబా ప్రకారం, వరుణ్ తన వంతు కోసం వేచి ఉండాల్సి రావచ్చని పేర్కొన్నాడు.
సబా కరీం పేర్కొన్న భారత ప్లేయింగ్ ఎలెవన్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా