Virat Kohli: భావితరాలకు ఓ బెంచ్‌మార్క్‌.. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి బెస్ట్ ఎగ్జామ్‌పుల్ కోహ్లీ: ప్రధాని మోడీ..

Virat Kohli 50th Century: విరాట్ సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. సచిన్ టెండూల్కర్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా కింగ్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.

Virat Kohli: భావితరాలకు ఓ బెంచ్‌మార్క్‌.. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి బెస్ట్ ఎగ్జామ్‌పుల్ కోహ్లీ: ప్రధాని మోడీ..
Team India Vs New Zealand Virat Kohli Pm Modi

Edited By:

Updated on: Nov 18, 2023 | 6:02 PM

ICC Cricket World Cup 2023: న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన స్కోర్ చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో ఏ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. భారత్‌ను ఇంత పెద్ద స్కోరుకు తీసుకెళ్లడంలో విరాట్‌ కోహ్లి పాత్ర ఎంతో ఉంది. విరాట్ 113 బంతుల్లో 117 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని వన్డే కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులు సృష్టించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు చేయడం అత్యంత ప్రత్యేకమైన రికార్డులలో ఒకటిగా నిలిచింది. దీనిపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, విరాట్ తన 50వ సెంచరీని సాధించాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 49 ODI సెంచరీల రికార్డును వదిలిపెట్టాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతో విరాట్ సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. సచిన్ టెండూల్కర్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా కింగ్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అభినందనలు..

విరాట్‌ను ప్రశంసిస్తూ పీఎం మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో “ఈ రోజు, విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 50వ వన్డే సెంచరీని మైదానంలో నమోదు చేయడమే కాకుండా, సంకల్పం, స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి అద్భుతమైన ఉదాహరణను చూపించాడు. ఇది ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని చూపుతుంది. ఒక అద్భుతమైన విజయం. అతని శాశ్వతమైన అంకితభావానికి, సాటిలేని ప్రతిభకు నిదర్శనం. ఈ ఘనత సాధించినందుకు విరాట్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అతను రాబోయే తరాలకు ఒక బెంచ్‌మార్క్‌లా నిలిచాడు” అంటూ ప్రశంసించారు.

ప్రధాని మోదీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. ” 2023 ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో అద్భుతంగా ఆడాడు. అతను ఒక చారిత్రాత్మక సెంచరీని సాధించాడు. 50 ODI సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు” అంటూ పోస్ట్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..