AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: లెవెల్ అయిపోయిందిగా.. 92 ఏళ్ల చరిత్రలో రోహిత్ సేన సరికొత్త రికార్డు.. అదేంటో తెలుసా?

భారత్ -ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

Team India: లెవెల్ అయిపోయిందిగా.. 92 ఏళ్ల చరిత్రలో రోహిత్ సేన సరికొత్త రికార్డు.. అదేంటో తెలుసా?
Team India
Basha Shek
|

Updated on: Mar 10, 2024 | 11:38 AM

Share

భారత్ -ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో స్వదేశంలో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. విశేషమేమిటంటే.. ఈ విజయంతో టెస్టు మ్యాచ్ ల ఫలితాలనూ టీమిండియా సమం చేసింది.భారత జట్టు ఇప్పటివరకు మొత్తం 579 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 178 మ్యాచ్‌ల్లో ఓడి 178 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 222 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.. దీంతో టీమిండియా 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా, భారత్ గెలుపు-ఓటముల నిష్పత్తిని సరిగ్గా 1: 1 సాధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. 2000 సంవత్సరం వరకు టీం ఇండియా కేవలం 61 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అలాగే 112 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంటే గత 24 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీం ఇండియా విజయాల శాతం గణనీయంగా పెరిగింది. 24 ఏళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. భారత జట్టు 117 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం 66 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. అలా 2000లో 61 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు 2024లో విజయాల సంఖ్యను 178కి పెంచుకోగలిగింది.

ఇవి కూడా చదవండి

గత 2 దశాబ్దాలుగా టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం చెలాయిస్తోందనడానికి ఈ గణంకాలే నిదర్శనం. మరియు ఈ విజయంతో ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును 4-1 తేడాతో ఓడించి టెస్ట్ క్రికెట్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడం 112 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది, 2 ఓడిపోయింది మరియు 1 డ్రా చేసుకుంది. మొత్తం 68.51% విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా 3 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 60.00% విజయ శాతంతో కివీస్ జట్టు కొత్త ర్యాంకింగ్ జాబితాలో 2వ స్థానంలో నిలిచింది.

జైషా చేతుల మీదుగా విన్నింగ్ ట్రోఫీని అందుకుంటోన్న కెప్టెన్ రోహిత్ శర్మ..

మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us