AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే.. ఇన్నాళ్లు టీమిండియా మిస్సయింది ఇతనినేనా.. సూపర్ స్కెచ్‌తో రంగంలోకి మిస్టరీ ప్లేయర్?

Team India Playing 11 Changes: ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగడం వల్ల గత మ్యాచ్‌లో భారత్ చేతులు కట్టేసినట్లయింది. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చే వరకు భారత్ కచ్చితంగా అదనపు పేసర్ వ్యూహాన్నే కొనసాగించాలి. అప్పుడే ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలవాలనే టీమిండియా కల నెరవేరుతుంది.

అరెరే.. ఇన్నాళ్లు టీమిండియా మిస్సయింది ఇతనినేనా.. సూపర్ స్కెచ్‌తో రంగంలోకి మిస్టరీ ప్లేయర్?
Ind Vs Eng 3rd T20i Playing Xi Changes
Venkata Chari
|

Updated on: Jul 07, 2026 | 11:44 AM

Share

India vs England 3rd T20I: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుస ప్రయోగాలతో తలకిందులవుతోంది. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకున్న మేనేజ్మెంట్, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. రవి బిష్ణోయ్ స్థానంలో ఒక అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఇంగ్లాండ్ పిచ్‌లపై సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భారత్ భావిస్తోంది.

జట్టులో సమతుల్యత లోపం.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం

గత కొన్ని ఏళ్లుగా భారత జట్టు కొత్త యాజమాన్యం కింద అన్ని ఫార్మాట్లలోనూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ అయిన టీ20 జట్టులో ఈ ప్రయోగాలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో మ్యాచ్‌లో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లతో కూడిన ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం పూర్తిగా విఫలమైంది. జట్టులో కేవలం అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా మాత్రమే ప్రధాన పేసర్లుగా ఉండటంతో, ఇంగ్లాండ్ బ్యాటర్లకు క్రీజులో ఎదురులేకుండా పోయింది.

ఇది కూడా చదవండి: Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

ఇవి కూడా చదవండి

బిష్ణోయ్ ఓవర్ ముంచేసింది.. పేసర్ల కొరత స్పష్టం

మ్యాచ్ కీలక దశకు చేరిన 17వ ఓవర్లో, స్పిన్‌ను అద్భుతంగా ఆడే జాకబ్ బెథెల్, సామ్ కరన్‌ల ముందు రవి బిష్ణోయ్‌కు బంతిని ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే ప్రధాన పేసర్ల ఓవర్లను ఆఖరి కోసం దాచి ఉంచడం వల్ల భారత్‌కు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఆ ఓవర్లో బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ను చేజార్చాడు. శివమ్ దూబే పార్ట్ టైమ్ బౌలర్ అయినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో అతడిని ఉపయోగించడానికి కెప్టెన్ ధైర్యం చేయలేదు. స్పిన్నర్లు అందరూ కలిసి ఓవర్‌కు దాదాపు పది పరుగులు ఇవ్వడం భారత బౌలింగ్ బలహీనతను బయటపెట్టింది. హార్దిక్ పాండ్యా జట్టులో లేనప్పుడు, బ్యాటింగ్ లోతును కొద్దిగా త్యాగం చేసినా సరే, ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగడం చాలా అవసరం.

పార్ట్ టైమ్ స్పిన్నర్లతోనే పని కానిచ్చేయొచ్చు..!

జట్టులో మూడో స్పిన్నర్ కోసం ఒక స్పెషలిస్ట్ బౌలర్‌ను తీసుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఎందుకంటే జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ రూపంలో చక్కటి పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సాంప్రదాయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో పాటు, కుడిచేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బ్యాక్‌స్పిన్ కూడా వేయగలడు. ఐపీఎల్‌లో అతను ఈ బంతులతో వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు తిలక్ వర్మ ఆఫ్ స్పిన్ కూడా జట్టుకు ఉపయోగపడుతుంది. కుల్దీప్ యాదవ్ జట్టులో లేనప్పుడు, బలహీనమైన స్పిన్ విభాగాన్ని నమ్ముకోవడం కంటే పేస్ వైపే మొగ్గు చూపడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: IND vs ENG: అగ్నిపరీక్షకు సిద్ధమైన కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

నాటింగ్‌హామ్‌లో ప్రిన్స్ యాదవ్ ఎంట్రీ ఖాయమేనా?

ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను ఆడించడం అత్యంత ఉత్తమమైన నిర్ణయం అవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సరికొత్త బంతితో ప్రిన్స్ చూపించిన స్వింగ్ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో అతను దిట్ట. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి ప్రిన్స్ యాదవ్ కొత్త బంతిని పంచుకుంటే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయవచ్చు. అంతేకాదు, డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో, పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో కూడా ప్రిన్స్‌కు మంచి పట్టు ఉంది. అతను పవర్‌ప్లేలో బౌలింగ్ చేస్తే, మిడిల్ ఓవర్లలో హర్షిత్ రాణాను ప్రత్యర్థులపైకి అస్త్రంగా ప్రయోగించే వీలు కలుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us