AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: 4 నెలల తర్వాత బరిలోకి టీమిండియా.. నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. ప్లేయింగ్ 11లో ఇదే?

Bangladesh Women vs India Women: గత నాలుగు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని హర్మన్‌ప్రీత్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

IND vs BAN: 4 నెలల తర్వాత బరిలోకి టీమిండియా.. నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. ప్లేయింగ్ 11లో ఇదే?
Ind Vs Ban
Venkata Chari
|

Updated on: Jul 09, 2023 | 8:53 AM

Share

Bangladesh Women vs India Women: సుదీర్ఘ విరామం తర్వాత అంటే దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు ఈరోజు (జులై 9) బరిలోకి దిగనుంది. గత నాలుగు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ (IND vs BAN)తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఆదివారం నుంచి టీ20 సిరీస్‌తో పర్యటనను ప్రారంభించనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత మహిళల జట్టు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓడి, టీ20 ప్రపంచకప్‌ నుంచి మహిళల జట్టు రిక్తహస్తాలతో నిష్క్రమించింది. దీని తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి, సిరీస్‌లోని రెండవ మ్యాచ్ జులై 11న, 3వ మ్యాచ్ జులై 13న మీర్పూర్‌లో జరగనుంది.

కొత్త ముఖాలకు అవకాశం..

ఇవి కూడా చదవండి

ఈ టూర్‌లో సెలక్టర్లు కొంతమంది కొత్త ముఖాలను అనుమతించారు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రెగ్యులర్ ప్లేయర్లు రిచా ఘోష్, ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్‌లను ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు. అలాగే శిఖా పాండే లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఈ టూర్‌కు జట్టుతో లేరు. ఇటువంటి పరిస్థితిలో రాశి కనోజియా, ఉమా ఛెత్రి, మిన్ను మణి, అనూషలను జట్టులోని సెలక్టర్లు ఎంపిక చేశారు. రిచా ఘోష్ లేకపోవడంతో, యాస్తిక భాటియా, ఉమా రూపంలో భారత్‌కు ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. తొలి మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన భాటియాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది

రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఈ ఇద్దరికి బదులు అనూష, రాశీలు టీమ్ ఇండియాకు అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు.

కౌన్ బనేగా ది ఫినిషర్?

రిచా ఘోష్ లేకపోవడంతో జట్టులో ఫినిషర్ సమస్య ఏర్పడింది. దీప్తి శర్మ రూపంలో జట్టుకు ఎంపిక ఉంది. అయితే, గతంలో ఈ పాత్రకు దీప్తి న్యాయం చేయలేకపోయింది. కాబట్టి, సెలక్షన్ బోర్డు పూజా వస్త్రాకర్‌ను విశ్వసించవచ్చు. యాస్తిక భాటియా ఓపెనర్‌గా ఉన్నప్పటికీ, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఉండటంతో ఆమెకు ఓపెనర్‌గా అవకాశం లభించలేదు. కాబట్టి, జట్టు ఆమెను ఫినిషర్‌గా ప్రయత్నించవచ్చు.

మోనికా పటేల్, మేఘనా సింగ్ కూడా ఈ సిరీస్ నుంచి భారత జట్టులోకి పునరాగమనం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా అద్భుతంగా రాణించి జట్టులో స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆసియా క్రీడలకు సన్నాహాలు..

సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టును పంపేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఆసియా క్రీడలకు సన్నాహక పరంగా హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ పర్యటన నుంచి జట్టు ఆటగాళ్లు ఆసియా క్రీడల కోసం తమ లయను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

పర్మినెంట్ కోచ్ లేరు..

భారత మహిళల జట్టు ప్రధాన కోచ్ లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరింది. అందుకే బంగ్లాదేశ్ పర్యటనకు తాత్కాలిక కోచ్‌గా నౌషీన్ అల్ ఖదీర్ నియమితులయ్యారు. అతని కోచింగ్‌లో భారత అండర్-19 మహిళల జట్టు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం, అమోల్ మజుందార్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

స్వదేశంలో బంగ్లాదేశ్ ఆధిక్యం..

స్వదేశంలో ఏ జట్టును ఓడించడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ను స్వదేశంలో ఓడించడం టీమిండియాకు అంత సులువు కాదు. స్వదేశంలో భారత్‌ను ఓడించే సత్తా ఈ జట్టుకు ఉంది. ఆతిథ్య జట్టును భారత్ తేలికగా తీసుకోదు. ఈ సిరీస్‌లో ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌బౌలర్‌ జహనారా ఆలమ్‌కు దూరమైంది. అలాగే ఫెర్గానా హక్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఆమె స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైంది. వీరిద్దరూ లేకుంటే బంగ్లాదేశ్ జట్టు కాస్త బలహీనపడటం ఖాయం. అయితే టీమిండియా జాగ్రత్తగా ఉండాలి.

రెండు జట్లు..

భారత్ – హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా, దేవికా వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, ఎస్. మేఘన, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా. అనూషా బారెడ్డి, మిన్ను మణి.

బంగ్లాదేశ్ – నిగర్ సుల్తాన్ (నాయకుడు), నహిదా అక్తర్, దిలారా అక్తర్, షాతీ రాణి, షమీమా సుల్తాన్, శోభనా మోస్త్రి, ముర్షిదా ఖాతున్, షోర్నా అక్తర్, రీతు మోని, దిశా బిస్వాస్, మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, మేఘ్లా, రబేయా ఖాన్, సుల్తాన్, సుల్తాన్ ఖతున్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..