AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: తొలి టెస్టులో విధ్వంసం.. భారత ఆల్ రౌండర్ దెబ్బకు వణికిపోయిన బంగ్లా.. జడేజా స్థానంలో ఎంట్రీ?

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో, భారత బౌలర్లు ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌ను 112 పరుగులకే కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో సౌరభ్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

IND vs BAN: తొలి టెస్టులో విధ్వంసం.. భారత ఆల్ రౌండర్ దెబ్బకు వణికిపోయిన బంగ్లా.. జడేజా స్థానంలో ఎంట్రీ?
India Vs Bangladesh 1st Unofficial Test Saurabh Kumar 4 Wickets
Venkata Chari
|

Updated on: Nov 29, 2022 | 4:11 PM

Share

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ విధ్వంసం సృష్టించడంతో మొత్తం జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ ఏ జట్టు టాస్‌ గెలిచి తొలుత ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ తర్వాత భారత బౌలర్లు ప్రకంపనలు సృష్టించారు. సౌరభ్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్ లు బంగ్లాదేశ్‌పై విధ్వంసం సృష్టించడంతో మొత్తం జట్టు 45 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది.

బంగ్లాదేశ్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ మాత్రమే భారత్‌ ధాడిని ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరితో పాటు నజ్ముల్ హుస్సేన్ 19, తైజుల్ ఇస్లాం 12 పరుగులు చేశారు. అతను తప్ప, ఏ బ్యాట్స్‌మెన్ కూడా 6 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు.

సౌరభ్, నవదీప్ విధ్వంసం..

సౌరభ్ 8 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతను 3 మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. అతడితో పాటు నవదీప్ 10 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అతిత్ సేథ్ 23 పరుగులకే బ్రేక్ త్రూ అందుకున్నాడు. రెండో ఓవర్ నుంచే భారత బౌలర్లు విధ్వంసం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

26 పరుగులకే సగం జట్టు ఔట్..

బంగ్లాదేశ్‌లో సగం మంది 13.1 ఓవర్లలో 26 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత, హసౌన్ ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించాడు. స్కోరును 100 పరుగులు దాటించాడు. అయితే బంగ్లాదేశ్ వికెట్లు ఒక ఎండ్ నుంచి పడిపోతూనే ఉన్నాయి. 108 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌కు హుస్సేన్ రూపంలో 8వ దెబ్బ తగిలింది. అంతకుముందు అలీ, తైజుల్ పెవిలియన్ బాట పట్టారు. హుస్సేన్ అవుటైన వెంటనే.. 2 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లు కూడా పడిపోయాయి.

సౌరభ్ అద్భుత ప్రదర్శన..

సౌరభ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ముగ్గురూ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యే విధంగా అతను 3 బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్ చేర్చాడు. సౌరభ్ బౌలింగ్‌లో తైజుల్, రెహ్మాన్ రాజా, ఖలీద్ అహ్మద్‌లు ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ కాగా, హుస్సేన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. సౌరభ్ గురించి మాట్లాడితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతన్ని స్టాండ్‌బైలో ఉంచారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రవీంద్ర జడేజా స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..