AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2022: క్వార్టర్ ఫైనల్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు..!

Team India: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు జనవరి 29న క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

U19 World Cup 2022: క్వార్టర్ ఫైనల్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు..!
Icc U19 World Cup 2022 Team India
Venkata Chari
|

Updated on: Jan 29, 2022 | 1:55 PM

Share

Indian Cricket Team: ICC అండర్ 19 వరల్డ్ కప్ 2022(ICC Under 19 World Cup 2022)లో గాయపడిన ఆల్ రౌండర్ వాసు వాట్స్(Vasu Vats) స్థానంలో ఆరాధ్య యాదవ్‌(Aaradhya Yadav) టీమిండిచాలో చేరాడు. ICC టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ శనివారం (జనవరి 29) దీనికి ఆమోదం తెలిపింది. వాసు వాట్స్‌కు స్నాయువుకు గాయం కావడంతో ఇక టోర్నీలో ఆడలేడని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం జరిగే సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆంటిగ్వాలో జరగనుంది. ఇందులో ఎవరు గెలిచినా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. ఈ టోర్నీలో వాసు వాట్స్ ఒక మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు.

ఆటగాడి ఎంపికకు టోర్నమెంట్ సాంకేతిక కమిటీ అనుమతి.. ఆటగాడి ఎంపికకు టోర్నమెంట్ సాంకేతిక కమిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ కమిటీ ఒప్పుకుంటేనే సదరు ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చు. సాంకేతిక కమిటీలో ఛైర్మన్ క్రిస్ టెట్లీ (ఐసీసీ ఈవెంట్ హెడ్), బెన్ లివర్ (ఐసీసీ సీనియర్ ఈవెంట్ మేనేజర్), ఫవాజ్ బక్ష్ (టోర్నమెంట్ డైరెక్టర్), రోలాండ్ హోల్డర్ (క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధి), అలెన్ విల్కిన్స్, రస్సెల్ ఆర్నాల్డ్ (స్వతంత్ర ప్రతినిధి) ఉన్నారు.

కీలక ప్లేయర్లు కరోనా ఫ్రీగా తేలారు.. అంతకుముందు, కెప్టెన్ యశ్ ధుల్‌తో సహా కీలక ఆటగాళ్లందరూ జట్టులోకి తిరిగి రావడం భారత జట్టుకు గుడ్‌న్యూస్‌లా మారింది. భారత జట్టులోని అరడజను మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. వారిలో చాలా మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని ఈ కీలకమైన మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐర్లాండ్ మ్యాచ్‌కు ముందు జరిగిన RT PCR పరీక్షలో ఆరుగురు ఆటగాళ్లు కెప్టెన్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, సిద్ధార్థ్ యాదవ్, ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పారిఖ్ పాజిటివ్‌గా తేలారు. ఈ ఆటగాళ్ళు ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇది నాలుగుసార్లు ఛాంపియన్‌గా మారిన జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఐదుగురు RT-PCR పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఉగాండాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడలేదు.

ఇప్పుడు వీరంతా శనివారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. ట్రినిడాడ్‌లో ఏడు రోజుల ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత ధుల్, కరోనా నుంచి కోలుకున్న ఆటగాళ్లు శుక్రవారం ఉదయం ఆంటిగ్వా చేరుకున్నారు. అయితే ధుల్ లేకపోవడంతో జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ సింధు సానుకూలంగా స్పందించాడు. అతను మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. అతని స్థానంలో అనీశ్వర్ గౌతమ్ జట్టులోకి వస్తాడు.

2020 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి.. 2020 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడింది. ఇందులో బంగ్లా జట్టు బలమైన ప్రత్యర్థి భారత్‌ను ఓడించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ రకీబుల్ హసన్ ఆ చిరస్మరణీయ ఫైనల్‌లో భాగమయ్యాడు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఆసియా కప్ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Watch Video: ఇలా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం తప్పు.. ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ సింగ్.. వైరల్ వీడియో

BCCI: దాని కంటే మీకు ఐపీఎల్‌ ఎక్కువైందా.. భారత క్రికెట్‌కు వెన్నుముక లేకుండా చేస్తారా: బీసీసీఐపై మాజీల విమర్శలు