AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీమిండియా సెమీస్ రూట్ ఇదే.. ఆసీస్‌పై గెలిచినా, ఆ రెండు జట్లపైనే చూపంత..

ICC Womens T20 World Cup 2024: మహిళల T20 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేస్తే సెమీఫైనల్ ప్రవేశం దాదాపు ఖాయం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించిన సంగతి తెలిసిందే.

T20 World Cup 2024: టీమిండియా సెమీస్ రూట్ ఇదే.. ఆసీస్‌పై గెలిచినా, ఆ రెండు జట్లపైనే చూపంత..
Womens T20 World Cup
Venkata Chari
|

Updated on: Oct 10, 2024 | 5:05 PM

Share

T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌లో 12వ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో టీమిండియా సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించింది. కాగా, నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కాగా, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ బ్యాటింగ్ చేసిన షఫాలీ వర్మ (43), స్మృతి మంధాన (50) తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 27 బంతుల్లో 1 సిక్స్, 8 ఫోర్లతో అజేయంగా 52 పరుగులు చేసింది. ఈ అర్ధశతకంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది.

రెండో స్థానంలో భారత్..

వరుస విజయాలతో నెట్ రన్ రేట్ పెరిగి పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. +0.576 నెట్ రన్ రేట్‌తో, భారత జట్టు తమ చివరి మ్యాచ్‌లో అలవోకగా గెలిస్తే సెమీ-ఫైనల్‌కు చేరుకోగలదు.

ఎందుకంటే పాకిస్థాన్ (+0.555), న్యూజిలాండ్ (-0.050) జట్లు సెమీ-ఫైనల్ రేసులో ఉన్నాయి. 2 పాయింట్లు ఉన్న ఈ జట్లు మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే టీమ్ ఇండియాకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అంటే భారత జట్టు చివరి మ్యాచ్‌లో గెలిస్తే మొత్తం 6 పాయింట్లు వస్తాయి.

వచ్చే రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ లేదా న్యూజిలాండ్ జట్లు భారీ విజయం సాధిస్తే 6 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోవచ్చు. కాబట్టి, తన చివరి మ్యాచ్‌లో భారత జట్టుకు భారీ విజయం అనివార్యం. తద్వారా మంచి నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.

అదే సమయంలో, గ్రూప్ A పాయింట్ల పట్టికలో, ఆస్ట్రేలియా జట్టు 2 విజయాలతో నికర రన్ రేట్ +2.524గా నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచినా, మెరుగైన నెట్ రన్ రేట్‌తో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించవచ్చు.

అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ భవిష్యత్తును ఈ మ్యాచ్‌ తేల్చనుంది.

టీమ్ ఇండియా సెమీ ఫైనల్ మార్గం ఎలా ఉందంటే..

ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం నమోదు చేయాలి.

న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంకపై ఓడిపోవాలి.

న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలవాలి, ఆస్ట్రేలియాపై ఓడిపోవాలి.

తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ లేదా న్యూజిలాండ్ గెలిస్తే నెట్ రన్ రేట్‌లో వెనుకబడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us