Video: చిన్న స్వామీలో చంపక్ తో చిందులేసిన టీమిండియా లెజెండ్!
సునీల్ గావస్కర్ బెంగళూరులో జరిగిన ఆర్సీబీ-రాజస్తాన్ మ్యాచ్కు ముందు రోబో కుక్క 'చంపక్'తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఐపీఎల్ 2025లో పరిచయం చేసిన ఈ రోబో, ప్రసారాన్ని కొత్తగా మార్చేందుకు తీసుకొచ్చారు. గావస్కర్ చంపక్తో చేసిన సరదా నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ల కన్నా బయట కూడా ఐపీఎల్ వినోదాన్ని అందించగలదని ఈ సంఘటన చూపించింది.

భారత క్రికెట్ లెజెండ్ మరియు ప్రస్తుత వ్యాఖ్యాత సునీల్ గావస్కర్, ఈ సారి ఐపీఎల్ 2025లో కేవలం మ్యాచ్లకే కాకుండా, మైదానబయటి వినోదానికి కూడా మునిగిపోయారు. బెంగళూరులో రాజస్తాన్ రాయల్స్తో జరుగిన ఆర్సీబీ మ్యాచ్కు ముందు, గావస్కర్ ఐపీఎల్ కొత్త పరిచయమైన రోబోటిక్ కుక్క ‘చంపక్’ తో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వినోదభరిత దృశ్యాలు కెమెరాలో బంధించబడి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చంపక్ అనే ఈ నాలుగు కాళ్ల రోబో డాగ్ను, ఈ సీజన్లో అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రసారాన్ని నూతనంగా మార్చేందుకు ఐపీఎల్ ప్రవేశపెట్టింది.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ విక్టరీ సాధించింది. ఇక మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తరఫున ఓపెనర్ ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు చేసి వనిండూ హసరంగ చేతికి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మంచి ఆరంభం ఇచ్చాడు. అనంతరం పడిక్కల్ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ చివరి రెండు ఓవర్లలో 18 పరుగుల డిఫెండ్ చేసుకొని ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి సూపర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన స్టార్ట్ అందించాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులు చేసి అదరగొట్టాడు. కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి దుమ్మురేపాడు. టిమ్ డేవిడ్ 23, జితేష్ శర్మ 10 బంతుల్లో 20 రన్స్ చేసి మంచి ఫినిష్ ఇచ్చారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్ విజయంలో విరాట్ కోహ్లీ, హేజల్వుడ్, కృనాల్ పాండ్యా పాత్ర చాలా ఉంది. కానీ, రాజస్థాన్ ఆల్మోస్ట్ గెలిచేసింది అనే మూమెంట్లో వికెట్ కీపర్ జితేష్ శర్మ తీసుకున్న ఓ రివ్యూ మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేసింది. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి.. మ్యాచ్ను ఈజీగా ఫినిష్ చేసేలా కనిపించాడు ఆర్ఆర్ బ్యాటర్ ధృవ్ జురెల్. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అయితే 19 వ ఓవర్ లో హేజిల్ వుడ్ కేవలం ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసాడు.
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఈ సీజన్లో తొలిసారి 200 ప్లస్ స్కోర్ చేసింది. ఇంత పెద్ద స్కోర్ను కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలో తడబడినా.. కృనాల్ పాండ్యా, జోష్ హేజల్వుడ్ సూపర్ బౌలింగ్తో రాజస్థాన్ చేతుల్లోంచి మ్యాచ్ను లాక్కున్నారు. ఈ మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్కు తప్పనిసరిగా గెలవాల్సినది, ఎందుకంటే ఓటమి అయితే ప్లేఆఫ్ ఆశలపై పూర్తిగా నీళ్లు చెళ్లజేస్తుంది.
Looks like Sunny G found a new friend 😊 #TATAIPL | #RCBvRR pic.twitter.com/VPX7CU2ZMb
— IndianPremierLeague (@IPL) April 24, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



