AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఏం ఆట ఆడుతున్నారు.. లక్నో ఆటగాళ్లపై మెంటర్‌ గౌతమ్ గంభీర్‌ ఆగ్రహం.. వీడియో వైరల్‌..

IPL 2022(IPL 2022)లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్(LSG), గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలయింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది...

IPL 2022: ఏం ఆట ఆడుతున్నారు.. లక్నో ఆటగాళ్లపై మెంటర్‌ గౌతమ్ గంభీర్‌ ఆగ్రహం.. వీడియో వైరల్‌..
Gambir
Srinivas Chekkilla
|

Updated on: May 11, 2022 | 3:32 PM

Share

IPL 2022(IPL 2022)లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్(LSG), గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలయింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఛేదనకు దిగిన లక్నో జట్టు 82 పరుగులకే ఆలౌటైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌ 14 ఓవర్లు కూడా ఆడలేకపోవడమే పెద్ద విషయం. కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ వంటి ఆటగాళ్లు రాణించకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్‌ పేకమేడలా కూలిపోయింది. ఈ ఓటమి లక్నో సూపర్‌జెయింట్‌ను కుదిపేసింది. ముఖ్యంగా మెంటర్ గౌతమ్ గంభీర్ చాలా కోపంగా కనిపించాడు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మొత్తం జట్టుతో సంభాషించాడు. జట్టు ఏం తప్పు చేసింది? మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని, అయితే ఓటమిని అంగీకరించడం తప్పేనని గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు చెప్పాడు. గౌతమ్ గంభీర్ వీడియోను లక్నో సూపర్‌జెయింట్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.

గౌతమ్ గంభీర్ వీడియోలో మాట్లాడుతూ’మ్యాచ్‌లో గెలుపు, ఓటములు సహజం. ఒక జట్టు గెలుస్తుంది, మరొకటి ఓడిపోతుంది. కానీ మ్యాచ్‌ను వదులుకోవడం పూర్తిగా తప్పు. మనం మ్యాచ్‌ వదులుకున్నామని నేను అనుకుంటున్నాను. మనం బలహీనంగా ఉన్నాం. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బలహీనులకు చోటు లేదు.’ అని అన్నాడు. ‘ఈ టోర్నీలో మేము చాలా జట్లను ఓడించాము. మేము మంచి క్రికెట్ ఆడాము, కానీ ఈ రోజు మనం చాలా ముఖ్యమైన ఆటపై అవగాహన కోల్పోయాము. గుజరాత్ బాగా బౌలింగ్ చేసింది.’ అని చెప్పాడు. పూణెలోని ఎంసీఏ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 144 పరుగులు చేసింది. పిచ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఈ స్కోరు తక్కువగానే భావించారు. కానీ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 22 గజాల స్ట్రిప్ పూర్తిగా మారిపోయింది. గుజరాత్ డైరెక్ట్ బౌలింగ్ ముందు లక్నో కేఎల్ రాహుల్, డి కాక్ వికెట్లను కోల్పోయింది. దీని తర్వాత లక్నో మిడిల్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ కూడా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

Read Also.. 180 సిక్సర్లు.. 3005 పరుగులు.. బౌలర్లను దంచేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. ఆ జట్టు నుంచి తప్పించారు..