Retirement: రిటైర్మెంట్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు.. లిస్టులో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..

Retirement: అంబటి రాయుడు IPL 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత అంబటి రాయుడు ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో అంబటి రాయుడు ఒకరు.

Retirement:  రిటైర్మెంట్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు.. లిస్టులో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..
Ambati Rayudu

Updated on: Jun 10, 2023 | 9:41 PM

Retirement: అంబటి రాయుడు IPL 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత అంబటి రాయుడు ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో అంబటి రాయుడు ఒకరు. చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా, ఈ ఆటగాడు ముంబై ఇండియన్స్ తరపున కూడా IPL ఆడాడు. కానీ అతను IPL 2023 సీజన్ ఆడేందుకు రిటైర్మెంట్ తర్వాత తిరిగి వచ్చాడు. IPL 2022 సీజన్ తర్వాత, అంబటి రాయుడు ఫ్రాంచైజీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ ఆటగాడు తన నిర్ణయం నుంచి U-టర్న్ తీసుకున్నాడు.

పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది 2010లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. 2011 ప్రపంచకప్ తర్వాత మళ్లీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న షాహిద్ అఫ్రిదీ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చివరకు ఈ పాకిస్థానీ ఆల్ రౌండర్ 2016 సంవత్సరంలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్న ఆయన ఇప్పుడు తన నిర్ణయం నుంచి యూ-టర్న్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి మొయిన్ అలీ వచ్చే నెలలో జరిగే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున ఆడనున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభ్యర్థన మేరకు 2003 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇలా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న జావగల్ శ్రీనాథ్ మళ్లీ రంగంలోకి దిగాడు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1987లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అతను 1992 ప్రపంచ కప్ ఆడేందుకు తిరిగి మైదానంలోకి వచ్చాడు. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్థాన్ 1992 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.

పాకిస్థానీ వెటరన్ జావేద్ మియాందాద్ ప్రపంచ కప్ 1996 తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ, కేవలం 10 రోజుల తర్వాత అతను తన నిర్ణయం నుంచి యూ టర్న్ తీసుకున్నాడు. నిజానికి 1996 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. భారత్‌పై ఓటమితో టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..