IND vs BAN: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. 15 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్?

India vs Bangladesh Test Series: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌తో భారత జట్టు నేరుగా టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సిరీస్‌ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాను కూడా ప్రకటించాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం నలుగురు భారత ఆటగాళ్లు తిరిగి రావడాన్ని చూడొచ్చు. ఈ నలుగురు ఆటగాళ్లలో ఒకరు 15 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడటం గమనార్హం.

IND vs BAN: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. 15 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్?
India Vs Bangladesh
Follow us

|

Updated on: Aug 12, 2024 | 1:55 PM

India vs Bangladesh Test Series: కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో శ్రీలంకలో విజయం, ఓటమి రెండింటినీ రుచిచూసి తిరిగి వచ్చిన టీమ్ ఇండియా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌తో భారత జట్టు నేరుగా టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సిరీస్‌ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాను కూడా ప్రకటించాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం నలుగురు భారత ఆటగాళ్లు తిరిగి రావడాన్ని చూడొచ్చు. ఈ నలుగురు ఆటగాళ్లలో ఒకరు 15 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడటం గమనార్హం.

నలుగురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌పై రీఎంట్రీ..

బంగ్లాదేశ్‌పై భారత టెస్టు జట్టులోకి తిరిగి రాగల నలుగురు ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా పేర్లు. వీరిలో బుమ్రా, అశ్విన్, జడేజా ఈ ఏడాది మార్చిలో తమ చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. అయితే, షమీ తన చివరి టెస్టును గతేడాది జూన్‌లో ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైతే 15 నెలల తర్వాత టెస్టు మ్యాచ్‌లు ఆడడం ఖాయం.

15 నెలల తర్వాత షమీ టెస్ట్ మ్యాచ్..

గాయం కారణంగా షమీ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లోనే కాదు.. బంగ్లాదేశ్ టూర్ ప్రారంభమయ్యే సమయానికి వైట్ బాల్ క్రికెట్‌లో షమీ ఏదైనా మ్యాచ్ ఆడాలంటే 10 నెలల సమయం ఉండేది. విశేషం ఏమిటంటే షమీ ఇప్పుడు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ, షమీ బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ ఆడడాన్ని చూడొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

అశ్విన్, బుమ్రా, జడేజా కూడా పునరాగమనం..

అశ్విన్ విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ విధానం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అతను రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడతాడు. మార్చిలో ఇంగ్లండ్‌తో స్వదేశీ సిరీస్‌ను ఆడిన తర్వాత, అతను ఇప్పుడు నేరుగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఆడనున్నాడు.

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన తర్వాత టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా, జడేజా కూడా టీమ్‌ఇండియాలో భాగమయ్యారు. శ్రీలంకతో జరిగిన వైట్ బాల్ సిరీస్ నుంచి వీరిద్దరికి విశ్రాంతినిచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నుంచి టీమ్ ఇండియాలో పునరాగమనం చేయగలరని భావిస్తున్నారు.

WTC ఫైనల్‌కు బంగ్లాదేశ్ సిరీస్ కీలకం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం కోసం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ముఖ్యమైనది. ఇటువంటి పరిస్థితిలో, షమీ, బుమ్రా, అశ్విన్, జడేజాల పునరాగమనం భారత్‌కు మరింత ముఖ్యమైనది. షమీ, బుమ్రా కలిసి భారత పేస్‌ అటాక్‌కు బలం చేకూర్చారు. స్పిన్‌లో అశ్విన్‌, జడేజా జోడీ అద్భుతాన్ని ప్రపంచం చాలాసార్లు చూసింది.

గత నాలుగేళ్లలో వికెట్లు జాతర..

గత 4 ఏళ్లుగా చూస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఈ నలుగురే. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 181 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 180 వికెట్లతో అతని వెనుక ఉన్నాడు. జడేజా 141 వికెట్లు, షమీ 127 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..