204 మ్యాచ్‌ల్లో 572 వికెట్లు.. కట్ చేస్తే.. ఈ టీమిండియా బౌలర్ 6 ఏళ్లు జైలు పాలయ్యాడు.. ఎవరంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ ఉదయ్ జోషి ఈరోజు 78వ ఏట అడుగుపెట్టాడు. 1944 సంవత్సరంలో డిసెంబర్ 23న రాజ్‌కోట్‌లో జన్మించిన జోషి..

204 మ్యాచ్‌ల్లో 572 వికెట్లు.. కట్ చేస్తే.. ఈ టీమిండియా బౌలర్ 6 ఏళ్లు జైలు పాలయ్యాడు.. ఎవరంటే?
Cricket
Follow us

|

Updated on: Dec 23, 2022 | 10:23 AM

టీమిండియా మాజీ క్రికెటర్ ఉదయ్ జోషి ఈరోజు 78వ ఏట అడుగుపెట్టాడు. 1944 సంవత్సరంలో డిసెంబర్ 23న రాజ్‌కోట్‌లో జన్మించిన జోషి.. భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితేనేం దేశవాళీ క్రికెట్‌లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం అమెరికాలో జోషి నివాసముంటుండగా.. అతడి జీవితంలోని ఓ చీకటి కోణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

అది ఆగష్టు 1979, ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో ససెక్స్‌ కౌంటీ క్లబ్ తరపున ఉదయ్ జోషి క్రికెట్ ఆడుతున్నాడు. ఇంతలో అతడు స్థానిక క్లబ్ కోసం క్రికెట్ ఆడాలనే ఉద్దేశ్యంతో ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ అతడిపై వచ్చిన సంచలన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీబీసీ నివేదిక ప్రకారం, ఈ మాజీ భారత క్రికెటర్ ఉదయ్ జోషి ఉత్తర ఐర్లాండ్‌లో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపధ్యంలో అతడికి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అనంతరం తనపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవని అభివర్ణిస్తూ, తాను నిర్దోషినని పేర్కొంటూ ఉదయ్ జోషి అప్పీలు దాఖలు చేశారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఈ విషయం సద్దుమణిగింది గానీ అతడిపై పడిన మరక మాత్రం అలానే ఉండిపోయింది.

18 సంవత్సరాలు, 4 జట్లు, 204 మ్యాచ్‌లు, 572 వికెట్లు

భారత క్రికెటర్ ఉదయ్ జోషి 1965 నుంచి 1983 మధ్య గుజరాత్, రైల్వేస్, ససెక్స్, సౌరాష్ట్ర జట్ల తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ 4 జట్లతో మొత్తంగా 204 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 186 ఫస్ట్ క్లాస్ క్రికెట్, 18 లిస్ట్ A మ్యాచ్‌లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి ఖాతాలో 557 వికెట్లు, 1 సెంచరీతో 2287 పరుగులు ఉన్నాయి. ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 15 వికెట్లు తీశాడు. బ్యాట్‌తో 57 పరుగులు సాధించాడు. కాగా, డిసెంబర్ 23న 78 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్ ఉదయ్ జోషి ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నారు.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు