AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ‘ఆ ముగ్గురిలో ఇద్దరిని మాత్రమే ఎంచుకోండి.. లేదంటో మరో ఓటమి పక్కా’

India vs Australia ODI Series: మొత్తంగా, ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి, ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం, బలహీనమైన బౌలింగ్ కాంబినేషన్ అని మాజీలు చెబుతున్నారు. ప్రపంచకప్ ముందు జట్టు కూర్పుపై ఈ విమర్శలు తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

IND vs AUS: 'ఆ ముగ్గురిలో ఇద్దరిని మాత్రమే ఎంచుకోండి.. లేదంటో మరో ఓటమి పక్కా'
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Oct 24, 2025 | 1:54 PM

Share

Team India: భారత క్రికెట్‌లో, ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) సమీపిస్తున్న వేళ, జట్టు ఎంపిక (Team Selection) ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే (AUS vs IND 2nd ODI 2025)లో భారత్ ఓటమి పాలైన తరువాత, మాజీ క్రికెటర్ల విమర్శలు మరింత పెరిగాయి. ఈ సందర్భంలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ స్పిన్నర్స్ ఒకరు చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.

“ఆ ముగ్గురిలో ఇద్దరినే ఎంచుకోవాలి”..

భారత జట్టు ఫ్లెక్సిబిలిటీ పేరుతో ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లను ఒకేసారి జట్టులోకి తీసుకోవడంపై సదరు మాజీ స్పిన్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు మరెవరో కాదు, భారత జట్టుకు, చెన్నై తరపున కూడా ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు పీయూష్ చావ్లా, హర్బజన్ సింగ్.

చావ్లా విమర్శలు..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ మధ్య ఓవర్లలో తడబడింది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ డెప్త్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో, జట్టు మేనేజ్‌మెంట్ కీలకమైన బౌలర్లను పక్కన పెట్టడంపై చావ్లా దృష్టి సారించారు. ఇందులో అక్షర్ పటేల్ (Akshar Patel), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

“ఈ ముగ్గురు ఆటగాళ్లలో (అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్) ఇద్దరిని మాత్రమే తుది జట్టులో ఉంచాలి” అంటూ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డారు.

ఎవరిని ఎంచుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలి?..

చావ్లా తన అభిప్రాయాన్ని మరింత వివరిస్తూ, జట్టు కూర్పు విషయంలో స్పష్టత అవసరమని తెలిపారు. భారత జట్టులో ఒక నాణ్యమైన, వికెట్ తీయగల స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండడం అత్యవసరం. కాబట్టి, కుల్దీప్ యాదవ్ను తప్పక ఆడించాలి. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరూ బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లే. అయితే, ఒకేసారి ఇద్దరిని ఆడించడం వల్ల జట్టులో బౌలింగ్ విభాగం బలం తగ్గుతుందని చావ్లా అన్నారు.

కుల్దీప్‌కు బదులుగా సుందర్ ఎందుకు?..

ఈ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు. సుందర్ బ్యాటింగ్ చేయగలడనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, అయితే దీనివల్ల ఒక అద్భుతమైన వికెట్ టేకింగ్ స్పిన్నర్‌ను కోల్పోయామని చావ్లా ఆవేదన వ్యక్తం చేశారు.

“అక్షర్ పటేల్ ఇప్పటికే బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌తో జట్టుకు అవసరమైన సమతుల్యతను అందిస్తున్నాడు. అతడికి తోడుగా వికెట్ తీయగల కుల్దీప్ యాదవ్ను ఎంచుకోవాలి. సుందర్‌ను తీసుకుంటే, అది కేవలం ‘జట్టులో ముగ్గురు స్పిన్నర్లు’ అనే సంఖ్యను పెంచడమే తప్ప, మ్యాచ్ గెలిపించే నాణ్యమైన బౌలింగ్ అందించదు” అంటూ విమర్శలు గుప్పించాడు.

జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు..

జట్టు ఎంపికలో భారత్ ‘వికెట్ టేకింగ్ ఆప్షన్స్’ కంటే ‘ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని’ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటోందని చావ్లా విమర్శించారు. ఒక ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై, నలుగురు సీమర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు (కుల్దీప్, అక్షర్) ఉండటం సరైన కూర్పు అవుతుందని ఆయన సూచించారు.

మొత్తంగా, ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి, ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం, బలహీనమైన బౌలింగ్ కాంబినేషన్ అని మాజీలు చెబుతున్నారు. ప్రపంచకప్ ముందు జట్టు కూర్పుపై ఈ విమర్శలు తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..