PCB: పీసీబీ ఘోర తప్పిదం.. ఆటగాడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. అన్ని జట్లలో మొదలైన భయం
లాహోర్లోని గడాఫీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల వైఫల్యం కారణంగా రచిన్ రవీంద్ర గాయపడ్డాడని సోషల్ మీడియాలో అభిమానులు ఆరోపిస్తున్నారు. లైట్లు సరిగా లేకపోవడం వల్ల అతను బంతిని సరిగ్గా చూడలేకపోయాడు. ఈ కారణంగా, బంతి అతని ముఖాన్ని నేరుగా తాకింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఎలాంటి సన్నాహాలు చేసిందనే దానిపై అభిమానులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు?

ఫిబ్రవరి 8న పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై-సిరీస్ మొదటి మ్యాచ్ సందర్భంగా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రకు ఒక భారీ ప్రమాదం జరిగింది. బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది అతని ముఖానికి నేరుగా తగిలి అతను నేలపై పడిపోయాడు. అతని ముఖం నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. ఆ తరువాత రచిన్ను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రాచిన్కు జరిగిన ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రమాదానికి పాకిస్తాన్ కారణమా? ఈ మ్యాచ్ జరిగిన గడాఫీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల లోపం కారణంగా రచిన్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడని చెబుతున్నారు.
ఫ్లడ్ లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రమాదం?
లాహోర్లోని గడాఫీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల వైఫల్యం కారణంగా రచిన్ రవీంద్ర గాయపడ్డాడని సోషల్ మీడియాలో అభిమానులు ఆరోపిస్తున్నారు. లైట్లు సరిగా లేకపోవడం వల్ల అతను బంతిని సరిగ్గా చూడలేకపోయాడు. దీని కారణంగా బంతి అతని కన్ను, నుదిటి దగ్గర నేరుగా తాకింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో, ఖుష్దిల్ షా ఇచ్చిన క్యాచ్ను రవీంద్ర పట్టుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ, మరుసటి క్షణంలో బంతి అతని ముఖాన్ని తాకి రక్తంతో తడిసిపోయాడు. నేలపై అలాగే కూర్చున్న రవీంద్ర.. కొద్దిసేపటి తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు.
ఈ ప్రమాదానికి ఎవరు భాద్యులు?
Rachin Ravindra couldn’t spot the ball & I hope this is not because of the LED lights Pakistan has been boasting about. ICC should check the lighting & arrangements thoroughly. pic.twitter.com/hp06LiPZWF
— Sushant Mehta (@SushantNMehta) February 8, 2025
చాలా కాలం తర్వాత, పాకిస్తాన్లో ఐసీసీ టోర్నమెంట్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్లో ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఐసీసీ పాకిస్థాన్కు కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా దాని వివిధ స్టేడియాలలో పునరుద్ధరణ పనులు జరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు కూడా గడాఫీ స్టేడియంలోనే జరుగుతాయి. ఈ క్రమంలో తాజాగా ట్రై-సిరీస్ జరుగుతోంది. దీంతో పెద్ద లోపం వెలుగులోకి వచ్చింది. కొత్త ఫ్లడ్లైట్లు ఇంత త్వరగా పాడైపోతాయా, అసలు PCB ఏం పనులు చేసిందంటూ అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ప్రమాదానికి పీసీబీనే బాధ్యత వహించాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, ఇతర జట్లు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రాణాలకే ప్రమాదం..
PCB should improve the Quality of light in the Ground. Rachin Ravindra misjudges the ball under bad lights and takes a brutal hit near the eye. Hope he Recover soon….।।। pic.twitter.com/nXXuwHI1fg
— Shakeel Md (@Shakeel7217) February 8, 2025
ఇలాంటి ప్రమాదాలు మైదానంలో ఒక ఆటగాడి ప్రాణాలను కూడా తీయగలవు. అదృష్టవశాత్తూ, బంతి రచిన్ రవీంద్ర ముఖాన్ని తాకింది. భారీ ప్రమాదం తప్పింది. కానీ తక్కువ వెలుతురు కారణంగా బంతి ఆటగాడి తలకు తగిలితే, మ్యాచ్లో పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఇలా జరిగితే ప్రాణాలను కూడా కోల్పోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..