AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ Vs పాక్.. పేపర్‌లోనే తోపులు.. బరిలోకి దిగారంటే సుస్సుపోసుకోవాల్సిందే.. లెక్కలు ఇవిగో

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 15న ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, అంతకుముందు ఇరుజట్లలోని ఆటగాళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకుందాం.

భారత్ Vs పాక్.. పేపర్‌లోనే తోపులు.. బరిలోకి దిగారంటే సుస్సుపోసుకోవాల్సిందే.. లెక్కలు ఇవిగో
Ind Vs Pak T20i
Venkata Chari
|

Updated on: Feb 12, 2026 | 6:22 PM

Share

India vs Pakistan: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 హై-వోల్టేజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15 ఆదివారం శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఎందుకంటే, విజేతగా నిలిచిన జట్టు సూపర్ 8 వైపు బలమైన అడుగు వేస్తుంది. అయితే, ఓడిన జట్టు మాత్రం తదుపరి రౌండ్ చేరుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చు. ఈ మ్యాచ్ కు ముందు, భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల హెడ్ టు హెడ్ గణాంకాలు ఎలా ఉన్నాయి, కాగితంపై ఎవరు తోపులో ఓసారి తెలుసుకుందాం..

భారత్ vs పాకిస్తాన్ టాప్ ఆర్డర్..

భారత్ vs పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ టీమిండియా టాప్ ఆర్డర్‌లో ఉండగా, పాకిస్తాన్ వైపు నుంచి, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాప్ ఆర్డర్‌కు నాయకత్వం వహిస్తారు.

భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇప్పటివరకు పాకిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి, 189.65 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు, తిలక్ వర్మ పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 130 సగటుతో 130 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్‌తో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.

సాహిబ్‌జాదా ఫర్హాన్ భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేశాడు. సైమ్ మూడు మ్యాచ్‌ల్లో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మూడు మ్యాచ్‌ల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. భారత జట్టు టాప్-ఆర్డర్ బ్యాటింగ్ పాకిస్తాన్‌పై గణనీయమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది.

మిడిల్ ఆర్డర్‌లో ఎవరు ఎక్కువ పవర్‌ఫుల్?

భారత జట్టు మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. వీరు వేగంగా రన్ రేటును పెంచగలరు. అదే సమయంలో, పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌లో బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు.

ఫహీమ్ తప్ప, ఇతర పాకిస్తానీ బ్యాట్స్‌మెన్ మిడిల్ ఆర్డర్‌లో సింగిల్స్, డబుల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్లను పరిశీలిస్తే, కెప్టెన్ సూర్య సగటు 165.64, రింకు సింగ్ 157.04, శివమ్ దుబే 149.70, హార్దిక్ పాండ్యా 144.27గా ఉంది.

షాదాబ్ ఖాన్ స్ట్రైక్ రేట్ 143.58, ఫహీమ్ అష్రఫ్ 139.37, మహ్మద్ నవాజ్ 134, బాబర్ అజామ్ 128, ఉస్మాన్ ఖాన్ 119.65గా ఉంది. దీంతో భారత జట్టు బలమైన, దూకుడు మిడిల్ ఆర్డర్ కలిగి ఉందని చూపిస్తుంది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ స్లో స్కోరింగ్ రేటుకు పేరుగాంచింది.

చివర్లో తోపులు ఎవరు?

భారత జట్టులో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్ళు లోయర్ ఆర్డర్‌లో ఉన్నారు. పాకిస్తాన్‌లో షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. బౌలింగ్ లైనప్‌లో భారత జట్టుదే పైచేయి. ఎందుకంటే, ఏ పరిస్థితిలోనైనా వికెట్లు తీయగల అనుభవజ్ఞులైన, దూకుడైన బౌలర్లు జట్టులో ఉన్నారు.

పాకిస్తాన్ జట్టు (India vs Pakistan) బౌలర్లలో, షహీన్ షా అఫ్రిది తప్ప, గణనీయమైన అనుభవం లేనట్లు కనిపిస్తుంది. భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ నుంచి మెరుగైన ప్రదర్శన కోసం పాకిస్తాన్ జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఎందుకంటే, అతను భారతదేశంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటువంటి పరిస్థితిలో అతను పాకిస్తాన్ కు ట్రంప్ కార్డ్ అని నిరూపించుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు