AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMAT 2025 : బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన SMAT క్రికెటర్లు, అధికారుల బృందం

SMAT 2025 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐను కూడా తాకింది.ఇండిగో సంక్షోభం కారణంగా బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల వేదికను మార్చక తప్పలేదు.

SMAT 2025 :  బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన SMAT క్రికెటర్లు, అధికారుల బృందం
Smat 2025
Rakesh
|

Updated on: Dec 05, 2025 | 7:47 PM

Share

SMAT 2025 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐను కూడా తాకింది. ఇండిగో సంక్షోభం కారణంగా బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల వేదికను మార్చక తప్పలేదు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్‌లో జరగాల్సిన చివరి 12 మ్యాచ్‌లు, సూపర్ లీగ్, ఫైనల్ మ్యాచ్‌లను ఇప్పుడు పుణెకు మార్చారు.

వేదిక మార్పుకు కారణాలు

SMAT నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పుడు పుణెలోని MCA స్టేడియం, డీవై పాటిల్ అకాడమీలలో జరుగుతాయి. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ రోహిత్ పండిట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కేవలం ఇండిగో విమానాల సంక్షోభం మాత్రమే కాకుండా, డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో డాక్టర్ల ప్రపంచ సదస్సు జరుగుతోంది. దీని కారణంగా ఇండోర్‌లో హోటల్ గదులు ఏవీ అందుబాటులో లేవు. అందుకే ఇండోర్ నగరంలో మ్యాచ్‌లను నిర్వహించలేమని తాము 15 రోజుల క్రితమే బీసీసీఐకి తెలియజేశామని పండిట్ చెప్పారు.

బీసీసీఐ ముందు లాజిస్టిక్ సవాళ్లు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వేదికలను మార్చినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఇప్పుడు కొన్ని తీవ్రమైన లాజిస్టిక్స్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాలుగు గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ నుంచి ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పుణెకు తరలించాలి. ఇతర దేశీయ టోర్నమెంట్లు కూడా జరుగుతున్నందున, ఇండిగో సంక్షోభం ఇలాగే కొనసాగితే, 8 జట్లను, అధికారులను పుణెకు చేర్చడం కూడా పెద్ద సవాలుగా మారుతుంది. అంతేకాకుండా అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 టీ20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బిహార్ ట్రోఫీ కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us