India vs Pakistan: యూఏఈ వేదికగా మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ ఫైట్.. తేదీ తదితర వివరాలివే
మొదట ఆసియాకప్లో, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ రెండూ మ్యాచుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ని వీక్షించే అవకాశం అభిమానులకు కలగనుంది.

మొదట ఆసియాకప్లో, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ రెండూ మ్యాచుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ని వీక్షించే అవకాశం అభిమానులకు కలగనుంది. ఇప్పటి వరకు సీనియర్ జట్ల మధ్యే పోటీ ఉండేది. ఇప్పుడు జూనియర్ జట్లు ఒకదానితో ఒకటి ఢీకొనబోతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న అండర్-19 ఆసియాకప్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అండర్-19 ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టును శనివారం (నవంబర్ 25) బీసీసీఐ ప్రకటించింది. యూఏఈలో డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ఈ 8 జట్ల టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్కు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన 19 ఏళ్ల ఆల్ రౌండర్ ఉదయ్ సహారన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే మధ్యప్రదేశ్కు చెందిన సౌమ్య కుమార్ పాండేకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు.
15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ముంబై, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా మొత్తం 12 రాష్ట్ర సంఘాలకు చెందిన ఆటగాళ్లకు అవకాశం లభించింది. గతంలో అండర్-19 జట్టుకు ఢిల్లీకి చెందిన యష్ ధుల్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఈసారి ఢిల్లీ నుండి ఏ ఆటగాడు ఈ జట్టులో భాగం కాలేదు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 ప్రపంచకప్కు సన్నాహకంగా ఉపయోగపడనుందని బీసీసీఐ భావిస్తోంది. అలాగే ప్రపంచకప్ జట్టు ఎంపికపైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ప్రపంచ కప్ కు సన్నాహకంగా..
🚨 NEWS 🚨
India U19 squad for ACC Men’s U19 Asia Cup announced
Details 🔽https://t.co/dZHCSv32a6
— BCCI (@BCCI) November 25, 2023
ఈ టోర్నీలో భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, జపాన్, యూఏఈ, నేపాల్ జట్లు కూడా పాల్గొంటాయి. మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్లు దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో జరుగుతాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ ఒకే గ్రూపులో ఉన్నాయి. డిసెంబర్ 8న భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కాగా, డిసెంబర్ 10న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 17న ఫైనల్ జరగనుంది. ఇప్పటి వరకు 9 సార్లు జరిగిన టోర్నీలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది.
భారత జట్టు
ఉదయ్ సహారన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్) ), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. రిజర్వ్- ప్రేమ్ డియోకర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.
ఆసియా కప్లో టీమిండియా షెడ్యూల్
- డిసెంబర్ 8- భారత్ vs ఆఫ్ఘనిస్తాన్
- 10 డిసెంబర్- భారత్ vs పాకిస్థాన్
- 12 డిసెంబర్- భారత్ vs నేపాల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








