Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs IND: భారత జట్టులో భయాందోళనలు.. 1 పరుగుకే 3 వికెట్లు.. 100 కూడా దాటని స్కోర్..

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్‌ పేలవ బ్యాటింగ్‌కు బంగ్లాదేశ్‌ అద్భుత బౌలింగ్‌ కారణంగా నిలిచింది.

BAN vs IND: భారత జట్టులో భయాందోళనలు.. 1 పరుగుకే 3 వికెట్లు.. 100 కూడా దాటని స్కోర్..
Ind Vs Ban 2nd T20i
Follow us
Venkata Chari

|

Updated on: Jul 11, 2023 | 4:27 PM

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు కోసం కష్టపడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌పై తొలి టీ20 విజయంలో మెరిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో టీ20లో ఖాతా తెరవలేకపోయింది. స్మృతి మంధానకు 100 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. కాబట్టి కొందరు డబుల్ ఫిగర్ కూడా దాటలేదు. ఫలితంగా భారత జట్టు మొత్తం 20 ఓవర్లలో 100 పరుగులు కూడా చేయలేకపోయింది.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్‌ పేలవ బ్యాటింగ్‌కు బంగ్లాదేశ్‌ అదిరిపోయే బౌలింగ్‌ కారణం. ముఖ్యంగా సుల్తానా ఖాతున్ టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడిన తీరు, భారత్‌ను 100 పరుగుల ముందు ఆపడంలో కీలక పాత్ర పోషించింది.

ఒక్క బౌలర్ దెబ్బకు 100 పరుగులు చేయలేకపోయిన భారత్..

బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ సుల్తానా ఖాతూన్ రెండో టీ20లో 4 ఓవర్లు వేసి 21 పరుగులకే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసింది. మొదటి బాధితురాలిగా షెఫాలీ వర్మ, 14 బంతుల్లో 19 పరుగులు చేసి ఔట్ అయింది. దీని తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను సుల్తానా చెదరగొట్టింది. తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్ రెండో మ్యాచ్‌లో కూడా ఖాతా తెరవలేకపోయింది. 14 బంతుల్లో 10 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ సుల్తానా మూడవ, చివరి బాధితులుగా మారారు.

కేవలం 1 పరుగుకే 3 వికెట్లు..

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ వికెట్ల పతనాన్ని ఈ గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 33 పరుగుల వద్ద హర్మన్‌ప్రీత్ అండ్ కో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత, ఈ స్కోరులో కొద్దిసేపటికే మరో 2 వికెట్లు తోడయ్యాయి. అంటే కేవలం 1 పరుగుకే 3 వికెట్లు పడిపోయాయి. వెనువెంటనే భారత్ స్కోరు 33/3 నుంచి 61/6కి చేరుకోగా 84 పరుగుల వద్ద 8వ వికెట్ పడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌తో జరిగిన ఒక మంచి విషయం ఏమిటంటే ఆలౌట్ కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..