AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఆసియా కప్ సమీపిస్తున్న కొద్దీ, టోర్నమెంట్‌లో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా, తాజాగా బీసీసీఐ కూడా 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, రోహిత్, కోహ్లీ, సిరాజ్, జడేజా వంటి కీలక ఆటగాళ్లు లేకుండా సూర్యకుమార్ సేన ఆడుతుండటం వల్ల అందరి దృష్టి ఈ జట్టు ప్రదర్శనపైనే ఉంటుంది.

Asia Cup 2025 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Team India
Rakesh
|

Updated on: Aug 21, 2025 | 8:26 AM

Share

Asia Cup 2025 : 2025 ఆసియా కప్‌కు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ, ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే దేశాలు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించగా ఆ తర్వాత బీసీసీఐ కూడా 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తోంది. భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉండటంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టుకు తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడం పెద్ద సవాలు. ముఖ్యంగా, రోహిత్, కోహ్లీ, సిరాజ్, జడేజా వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. అందుకే అందరి దృష్టి యువ ఆటగాళ్లపై ఉంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించారు. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరుగుతుంది. ఆ తర్వాత టోర్నమెంట్ రెండో రోజు, అంటే సెప్టెంబర్ 10న, టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను యూఏఈతో ఆడుతుంది.

సెప్టెంబర్ 14న టీమిండియా తమ రెండో లీగ్ మ్యాచ్‌ను పాకిస్థాన్తో ఆడనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌ను చూడటానికి చాలా మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి. ప్రస్తుత జట్లను గమనిస్తే, పాకిస్థాన్ కంటే టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరులో ఏ జట్టు గెలుస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత లీగ్ దశలో టీమిండియా చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ దీనికి అరగంట ముందు, అంటే రాత్రి 7 గంటలకు జరుగుతుంది.

ఈసారి ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ కాకుండా ఒమన్, యూఏఈ భారత గ్రూప్‌లో ఉన్నాయి. మరో గ్రూప్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు, హాంకాంగ్ కూడా ఉంది. లీగ్ దశ తర్వాత, తమ గ్రూప్‌లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత ఆ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..