AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భారత్, పాక్ మ్యాచ్‌కు మరో శని ఎంట్రీ..

India vs Pakistan: ఆసియా కప్ కోసం మ్యాచ్ రిఫరీలను ప్రకటించారు, దీనిలో అనుభవజ్ఞులైన రిఫరీలు రిచీ రిచర్డ్‌సన్, ఆండీ పైక్రాఫ్ట్ నాయకత్వం వహిస్తారు. భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. దీని కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక భారీ నిర్ణయం తీసుకుంది.

IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భారత్, పాక్ మ్యాచ్‌కు మరో శని ఎంట్రీ..
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Sep 09, 2025 | 5:18 PM

Share

India and Pakistan: ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 09 నుంచి జరుగుతుంది. రాబోయే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీల జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులైన మ్యాచ్ రిఫరీలు రిచీ రిచర్డ్‌సన్, ఆండీ పైక్రాఫ్ట్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తారు. ఈ టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుంది. ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది.

ఈ 10 మంది అంపైర్లకు ఛాన్స్..

అంపైర్ల బృందంలో అనేక దేశాల నుంచి అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. భారతదేశం నుంచి వీరేంద్ర శర్మ, రోహన్ పండిట్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. శ్రీలంక నుండి రవీంద్ర విమలసిరి, రుచిర పల్లియగురుగే జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ పక్తిన్, ఇజాతుల్లా సఫీ, పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ యాకుబ్, ఫైసల్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి గాజీ సోహైల్, మసుదుర్ రెహమాన్ కూడా అంపైరింగ్ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక జట్టు..

సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్‌కు మ్యాచ్ రిఫరీగా కీలక బాధ్యత అప్పగించారు. ఈ కీలక మ్యాచ్‌లో, రుచిర పల్లియగురుగే, మసుదుర్ రెహమాన్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. వారు మ్యాచ్ సమయంలో మైదానంలో ప్రతి నిర్ణయాన్ని నిశితంగా గమనించాల్సి ఉంటుంది. రుచిర పల్లియగురుగే గురించి చెప్పాలంటే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రసిద్ధి చెందాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో, ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. దీని కారణంగా వెస్టిండీస్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. గత సంవత్సరం శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. వీటిని సమీక్ష కారణంగా మార్చవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఈ మ్యాచ్‌లో అతని ప్రవేశం ఏ జట్టుకైనా హానికరం అని నిరూపించవచ్చు. చాలా మంది అతన్ని స్టీవ్ బక్నర్ కంటే డేంజరస్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దుబాయ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టీం ఇండియా..

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఎల్లప్పుడూ ఆసియా జట్లకు ఒక ముఖ్యమైన వేదిక. ఈసారి ఈ టోర్నమెంట్ 2026 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు జట్లకు వారి సన్నాహాలను అంచనా వేయడానికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆసియా కప్ కోసం టీమిండియా సెప్టెంబర్ 05న దుబాయ్ చేరుకుంది. ఇక్కడ భారత ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సూర్య కెప్టెన్సీలో భారత జట్టు మొదటిసారి టోర్నమెంట్ ఆడబోతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..