AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Suspended: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా.. బీసీసీఐ కీలక నిర్ణయం..

IPL Governing Council Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ప్రభావం ఐపీఎల్ పై కనిపించింది. ధర్మశాల పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేసేందుకు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2025 Suspended: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా.. బీసీసీఐ కీలక నిర్ణయం..
Ipl 2025
Follow us
Venkata Chari

|

Updated on: May 09, 2025 | 1:28 PM

IPL 2025 Suspended: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ప్రభావం ఐపీఎల్ పై కనిపించింది. ధర్మశాల పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేసేందుకు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అంటే, నేేడు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిలట్స్ మ్యాచ్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారులు ప్రస్తుతం జరుగుతున్న IPL 2025 సీజన్ భవిష్యత్తుపై ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. గురువారం (మే 8) ధర్మశాలలో జరగాల్సిన ఒక మ్యాచ్ నిలిపివేసిన తరువాత, విదేశీ ఆటగాళ్లలో పెరుగుతున్న ఆందోళనల తరువాత, ప్రస్తుతానికి టోర్నమెంట్‌ను నిలిపివేయడంతో సహా అన్ని ఎంపికలు ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

“ప్రస్తుత పరిస్థితుల్లో, లీగ్‌ను కొనసాగించాలా వద్దా అనేది అజెండాలో అత్యంత ముఖ్యమైన అంశం” అని తెలుస్తోంది.

అయితే, ఐపీఎల్‌ను నిలిపివేయాలా వద్దా, అది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఇది ఇలాగే కొనసాగితే, ముఖ్యంగా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పరిస్థితి ఏమిటి? దక్షిణ, తూర్పు ప్రాంతాలలోని సురక్షితమైన నగరాలకు మ్యాచ్‌లను తరలించడం కూడా ఒక ఎంపికగా భావిస్తున్నారు.

ఐపీఎల్ కు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి విదేశీ ఆటగాళ్ల ఆందోళనలను తగ్గించడం. వారు రోజురోజుకూ ఆందోళన చెందుతున్నారని, వారిని జట్టులో కొనసాగమని ఒప్పించడం సవాలుగా ఉంటుందని భావిస్తున్నారు.

16 మ్యాచ్‌లు జరగాలి..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు జరిగాయి. ఇంతలో, 58వ మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. అదే సమయంలో, ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇది మే 25న కోల్‌కతాలో ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లకు కొత్త షెడ్యూల్ తయారు చేయాల్సి ఉంది. 2021లో కూడా లీగ్‌ను సీజన్ మధ్యలో నిలిపివేసిన సమయంలోనూ ఇలాంటిదే కనిపించింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిలిపివేశారు. తరువాత మిగిలిన మ్యాచ్‌లు UAEలో జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..