AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఏఈలో ఐపీఎల్ టోర్నీకి బీసీసీఐ ఫ్లాన్..?

కరోనా కల్లోలంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. మనదేశంలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌ అయ్యే చాన్సే కనిపించడంలేదు. అయితే ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించేందుకు భారత క్రికెట్ కౌన్సిల్ భారీగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగనుంది.

యూఏఈలో ఐపీఎల్ టోర్నీకి బీసీసీఐ ఫ్లాన్..?
Balaraju Goud
|

Updated on: Jul 16, 2020 | 4:30 PM

Share

కరోనా కల్లోలంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. మనదేశంలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌ అయ్యే చాన్సే కనిపించడంలేదు. అయితే ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించేందుకు భారత క్రికెట్ కౌన్సిల్ భారీగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగనుంది.

దేశంలో కరోనా వైరస్‌‌‌‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఒక్క బాల్ కూడా పడే పరిస్థితులు లేవు. దీంతో ఐపీఎల్‌‌‌‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ను నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటి ఓ దఫా చర్చలు కొలిక్కి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

అలాగే, క్రికెటర్ల ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ను కూడా యూఏఈకి తరలించాలని క్రికెట్ కౌన్సిల్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌‌‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30 నుంచి 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొననున్నారు. ట్రయినింగ్ క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు. ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్‌‌‌‌ 26 నుంచి నవంబర్‌‌‌‌ 8 వరకు ఐపీఎల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ కనిపిస్తోంది. ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే.. ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు భారత్ టీంను ఎంపిక చేసే అవకాశముంది. ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌‌‌‌ నుంచి నేరుగా అస్ట్రేలియా చేరుకుంటారు. అయితే, బీసీసీఐ ప్లాన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావాలంటే ఇదంతా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌ నిర్వహణపై ఆధారపడి ఉంది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌పై ఐసీసీ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచిచూడాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించి అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌ జరుగనుంది. బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో జరుగనున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌ రద్దు కావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో యూఏఈలో ఐపీఎల్‌‌‌ టోర్నమెంట్ నిర్వహించేలా బిగ్ ఫ్లాన్ చేస్తోంది బీసీసీఐ.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్