ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్.. ఒక్క పాయింట్ తేడాతో చరిత్ర సృష్టించిన భారత్..!

ఒక్క పాయింట్.. అవును.. కేవలం ఒక్క పాయింట్ తేడాతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. మెక్సికోలోని ప్యూబ్లా వేదికపై ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ విజయం వెనుక ఉన్న కథ. ప్యూబ్లా ఆకాశం కింద ఆ క్షణం అసాధారణం.. గాలి కూడా ఆగిపోయినట్టే అనిపించింది. ప్రపంచం మొత్తం ఒక్క దిశగా చూస్తోంది. స్కోర్ బోర్డు ఉత్కంఠను మరింత పెంచుతోంది.

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్.. ఒక్క పాయింట్ తేడాతో చరిత్ర సృష్టించిన భారత్..!
Archery World Cup 2026 Puebla

Edited By:

Updated on: Apr 12, 2026 | 3:46 PM

ఒక్క పాయింట్.. అవును.. కేవలం ఒక్క పాయింట్ తేడాతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. మెక్సికోలోని ప్యూబ్లా వేదికపై ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ విజయం వెనుక ఉన్న కథ. ప్యూబ్లా ఆకాశం కింద ఆ క్షణం అసాధారణం.. గాలి కూడా ఆగిపోయినట్టే అనిపించింది. ప్రపంచం మొత్తం ఒక్క దిశగా చూస్తోంది. స్కోర్ బోర్డు ఉత్కంఠను మరింత పెంచుతోంది. ప్రతి బాణం ఒక నిర్ణయం.. ప్రతి షాట్ ఒక చరిత్ర. భారత మహిళల కాంపౌండ్ జట్టు జ్యోతి సురేఖ వెన్నం, ప్రగతి మధుర తమ ప్రతిభతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేశారు.

అమెరికా జట్టుతో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ మొదటి నుంచే హోరాహోరీగా సాగింది. ఒక్క జట్టు ముందుకు వస్తే, వెంటనే మరో జట్టు సమాధానం ఇచ్చింది. స్కోర్లు సమానంగా మారుతూ మ్యాచ్ చివరి క్షణాలకు చేరుకుంది. చివరి రౌండ్‌లో ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది. ప్రేక్షకుల హృదయాలు ఒక్కసారిగా కొట్టుకుంటున్నాయి. అంతిమ క్షణం రానే వచ్చింది. చివరి బాణం.. దేశ గౌరవం ఆ ఒక్క షాట్ మీదే ఆధారపడింది. జ్యోతి సురేఖ వెన్నం ధైర్యంగా ముందుకు వచ్చి బాణం సంధించింది. ఆ బాణం నేరుగా లక్ష్యాన్ని తాకింది. ఆ క్షణం భారత జట్టుకు విజయం దగ్గరైంది. చివరకు స్కోర్ బోర్డు మీద మెరిపించిన సంఖ్యలు 233–232. భారత జట్టుకు మన తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం సారథ్యం వహించారు.

ఒక్క పాయింట్ తేడా.. కానీ ఆ ఒక్క పాయింట్ వెనుక సంవత్సరాల కష్టం, పట్టుదల, త్యాగం ఉంది. భారత జట్టు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్యూబ్లా వేదికపై భారత జెండా ఎగిసింది. జాతీయ గీతం వినిపించిన ఆ క్షణం ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది. ఈ విజయంతో జ్యోతి సురేఖ వెన్నం తన కెరీర్‌లో 12వ వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆమెతో పాటు ప్రగతి, మధుర కూడా అద్భుత ప్రదర్శనతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇది కేవలం ఒక గోల్డ్ మెడల్ కాదు.. ఇది భారత అర్చరీ ప్రతిభకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. ఓటమి అంచుల దగ్గర నిలబడి, విజయాన్ని సొంతం చేసుకున్న ఈ జట్టు.. ఇప్పుడు కేవలం విజేతలు కాదు.. కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిచిపోయే హీరోలు..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us