Koniamman Temple: వైభవంగా కోనియమ్మన్ రథోత్సవం.. మత సామరస్యం చాటుకున్న ముస్లిం సోదరులు

ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్‌ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ఆలయాల్లోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కొందరు ఈ అమ్మవారి పేరుమీదునే నగరం వెలసింది అని నమ్మకం. 

Koniamman Temple: వైభవంగా కోనియమ్మన్ రథోత్సవం.. మత సామరస్యం చాటుకున్న ముస్లిం సోదరులు
Koniyamman Temple Festival

Updated on: Feb 29, 2024 | 7:08 AM

తమిళనాడులోని కోయంబత్తూరులోని నోయల్ నది ఉత్తర ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ దేవాలయం కోనియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం మత సామరస్యానికి వేదికగా నిలిచింది.  పార్వతి దేవి ప్రతి రూపంగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు.  అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఆలయ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్‌ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ఆలయాల్లోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కొందరు ఈ అమ్మవారి పేరుమీదునే నగరం వెలసింది అని నమ్మకం.

ఇక.. ఈ నెల 20న ధ్వజారోహణంతో కోనియమ్మన్ ఆలయ ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. పులి వాహనం, చిలుక వాహనం, సింహవాహనం, అన్నవాహనం.. ఇలా ప్రతి రోజూ అమ్మవారిని ఒక్కో వాహనంపై ఊరేగిస్తూ ఉత్సావాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోనియమ్మన్ ఆలయ రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని తాడుతో లాగి పూజలు చేశారు. ఈ క్రమంలో.. మసీద్‌ మీదుగా రథోత్సవం వెళ్తుండగా.. ముస్లిం సోదరులు తమ మత సామరస్యాన్ని చాటుకున్నారు. ముస్లిం సోదరులు భక్తులకు వాటర్‌ బాటిల్స్‌ అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us