
మన ఇళ్లలో సాధారణంగా కనిపించే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఇది కేవలం ఇంటి అందాన్ని పెంచే మొక్క మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షించే ఒక గొప్ప సాధనం. మనీ ప్లాంట్ ఆరోగ్యంగా, పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతుంటారు. అయితే మనీ ప్లాంట్ నుంచి పూర్తి ఫలితాలు పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన వాస్తు చిట్కాలు పాటించాలని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనీ ప్లాంట్ పెరిగే మట్టిలో కొద్దిగా పాలు కలపడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. పాలు స్వచ్ఛతకు, శ్రేయస్సుకు చిహ్నం. ఇలా చేయడం వల్ల మొక్క వేగంగా పెరగడమే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం నిలుస్తుందని, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.
మొక్క మొదట్లో కొంచెం చక్కెర కలపడం వల్ల ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం చక్కెర ఇంట్లో సంతోషాన్ని, సంపద పెరుగుదలను సూచిస్తుంది. అంతేకాకుండా ఇది జాతకంలోని రాహు దోష ప్రభావాలను తగ్గించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
మనీ ప్లాంట్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశలు కుబేరుడికి, సూర్యుడికి సంబంధించినవి కావడంతో సంపద ప్రవాహం పెరుగుతుంది.
(గమనిక: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 ధృవీకరించడం లేదు.)