Sikri Mata Temple: 1857 విప్లవానికి సాక్షి.. కోరిన కోర్కెలు తీర్చే సిక్రి మాత.. ఈ ఆలయంలోని మర్రి చెట్టు అమవీరుల చెట్టుగా ప్రసిద్ధి

|

Oct 01, 2022 | 5:35 PM

నవరాత్రుల్లో చారిత్రాత్మకమైన మహామాయ ఆలయంలో అమ్మవారు భక్తిశ్రద్దలతో పూజించి ప్రసాదం సమర్పించివారి కోరికలు నెక్స్ట్ ఇయర్ లోపు తప్పని సరిగా నెరవేరతాయని.. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆలయానికి వస్తారని పేర్కొన్నారు. ఈ ఆలయం 1857 విప్లవానికి కూడా సాక్షిగా నిలిచిందని ఆలయ పూజారి చెప్పారు

Sikri Mata Temple: 1857 విప్లవానికి సాక్షి.. కోరిన కోర్కెలు తీర్చే సిక్రి మాత.. ఈ ఆలయంలోని మర్రి చెట్టు అమవీరుల చెట్టుగా ప్రసిద్ధి
Sikri Mata Temple
Follow us on

భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం.. అనేక వింతలు విశేషాలు రహస్యాల ఆలయాలకు నెలవు. పండగలు, పర్వదినాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవాలని భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్‌లోని సిక్రి గ్రామంలో ఉన్న మహామాయా దేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది దాదాపు 550 సంవత్సరాల నాటిదని చారిత్రాత్మక కథనం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రులలో 9 రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారిని పూజించి భక్తులు ఏమి కోరుకున్నా ఆ కోరికలు తీరతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆరాధన, దర్శనం కోసం సిక్రి మాత ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంతేకాదు ఆలయంలో ఒక మర్రి చెట్టుకూడా ప్రసిద్ధి చెందింది. దీనిని అమరవీరుల మర్రి చెట్టు అని పిలుస్తారు.

వాస్తవానికి, అమ్మవారి ఆలయం పురాతనమైనది, చాలా చారిత్రాత్మకమైనది. ఈ దేవాలయం వందల సంవత్సరాల నాటిది. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నది. అయితే భక్తుల కోరికలు నెరవేడం మొదలు పెట్టిన తర్వాత.. భక్తులు అమ్మవారి కోసం ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని మర్రి చెట్టుకు బ్రిటిష్ వారు వందలాది మంది స్వాతంత్య్ర సమరయోధులను ఉరితీశారు. దీంతో ఈ మర్రి చెట్టుని అమరవీరుల మర్రి చెట్టుగా పిలుస్తారు.

కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లి:
సిక్రి మాత ఆలయ పూజారి మాట్లాడుతూ.. ఎవరైనా భక్తుడికి హృదయపూర్వకంగా ఎలాంటి కోరికలు కోరుకున్నా వారి కోరిక నెరవేరుతుందని చెప్పారు. నవరాత్రుల్లో అమ్మవారు భక్తిశ్రద్దలతో పూజించి ప్రసాదం సమర్పించివారి కోరికలు నెక్స్ట్ ఇయర్ లోపు తప్పని సరిగా నెరవేరతాయని.. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆలయానికి వస్తారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

చారిత్రాత్మకమైన మహామాయ ఆలయం 
ఈ ఆలయం 1857 విప్లవానికి కూడా సాక్షిగా నిలిచిందని ఆలయ పూజారి చెప్పారు. 1857లో ఆ ఊరి ప్రజలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. తమ ఊరి నుంచి బ్రిటీష్ వారిని వెనక్కి  పారిపోయేలా చేశారు. అయితే జిత్తులమారి బ్రిటీష్ వారు మోసపూరితంగా గ్రామాన్ని చుట్టుముట్టారు.  ఫిరంగులు, తుపాకీలతో గ్రామస్తులపై బుల్లెట్లు కాల్చారు.. ఆ సమయంలో భారీ సంఖ్యలో గ్రామస్థులు వీరమరణం పొందారు. ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు వ్యక్తులు గుడి కింద నిర్మించిన బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నారు. అక్కడ పట్టుబడిన వారిని  బ్రిటీష్ వారు ఆలయంలో  ఉన్న మర్రిచెట్టుకు వేలాడదీసిన వారు. 1857 నాటి విప్లవానికి సాక్ష్యంగా ఇప్పటికీ ఆలయంలో మర్రి చెట్టు నిలిచింది.  అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చే భక్తులు. అతను ఈ మర్రి చెట్టుకు కూడా నమస్కరిస్తారు.. విప్లవకారులకు నివాళులర్పిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..