AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Laddu: యాదగిరి నర్శన్న లడ్డూకు పెరిగిన డిమాండ్.. దీని ప్రత్యేకమేంటో తెలుసా..?

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి అంటే గుర్తుకు వచ్చేదీ స్వామి వారి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత రుచి, శుచిలో భక్తులు ఎక్కువగా ఇష్టపడేదీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం. అయితే ఇపుడు మహిమాన్విత యాదాగీరిశుడి లడ్డూ ప్రసాదానికి బాగా డిమాండ్ పెరిగింది.

Yadadri Laddu: యాదగిరి నర్శన్న లడ్డూకు పెరిగిన డిమాండ్.. దీని ప్రత్యేకమేంటో తెలుసా..?
Yadadri Laddu
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 02, 2024 | 1:16 PM

Share

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి అంటే గుర్తుకు వచ్చేదీ స్వామి వారి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత రుచి, శుచిలో భక్తులు ఎక్కువగా ఇష్టపడేదీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం. అయితే ఇపుడు మహిమాన్విత యాదాగీరిశుడి లడ్డూ ప్రసాదానికి బాగా డిమాండ్ పెరిగింది.

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ 30వేలు మంది భక్తులు, వారాంతపు, సెలవు దినాల్లో 65వేల మందికి పైగా దర్శించు కుంటున్నారు. ఏకశిఖర వాసుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్న భక్తులందరూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మహిమాన్వితంగా భావిస్తారు. స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్లడం ఆనవాయితీ. అయితే స్వామివారి ఆలయంలో ప్రసాదాల టోకెన్లు, ప్రసాదాల పంపిణీ ఒకేచోట ఉండడంతో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాలు పొందేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసాద విక్రయశాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది భక్తులు ప్రసాదాలను కొనుగోలు చేయకుండానే వెనుతిరుగుతున్నారు.

సంబోద్భావుడి దర్శనానికి వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రసాదాల విక్రయంపై దేవస్థానం అధికారులు దృష్టికి సారించారు. కొండ పైన శివాలయం పక్కన నూతనంగా ప్రసాదాల టికెట్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దర్శనానికి విచ్చేసిన భక్తులంతా కూడా కౌంటర్‌ వద్దకు వెళ్లకుండా ఒక్క సభ్యుడు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రసాదాల విక్రయాలను గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో రూ.1,74,63,580 అధికంగా ప్రసాదాల విక్రయాలు జరిగాయి. ప్రసాదాల నాణ్యతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రసాదాల టోకెన్లు, పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఆదివారంతో ఇతర సెలవు దినాల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడంలేదు. ఏప్రిల్‌ నెలలో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,05,08,630 కోట్లు రాగా, మే నెలలో రూ.4,79,72,210 ఆదాయం సమకూరింది.

ప్రసాదాల టోకెన్ల అవకతవకలను అరికట్టేందుకు..

తమ ఇలవేల్పుగా భావించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని భక్తులకు ప్రసాదాల సజావుగా ఉండేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. స్వామి వారి ప్రసాదాల విక్రయానికి సంబంధించిన రశీదు బుక్‌లను గతంలో దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించేవారు. ప్రసాదాల కొనుగోలు రశీదుల ముద్రణ బాధ్యతలు సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు అప్పగించారు. తద్వారా రశీదులు రీసైక్లింగ్‌ కాకుండా అడ్డుకట్ట పడిందని భావిసున్నారు. ఈ నిర్ణయంతో ప్రసాదాల విక్రయాలు పెరిగాయి. శివాలయం ఎదురుగా నూతనంగా ప్రసాదాల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు.

యాదాద్రి ప్రసాదానికి భోగ్ గుర్తింపు…

ఇప్పటికే శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు తర్వాత యాదాద్రి లద్దూ ప్రసాదాన్ని భక్తులు అమితంగా ఇష్టపడతారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి భోగ్‌(బ్లిస్‌ఫుల్‌ హైజీనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) జాతీయ స్థాయి గుర్తింపు పత్రం పొందింది.

మరిన్ని ఆధ్యాీత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us