TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుగిరులు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నందనం వరకు క్యూలైన్లో బారులు తీరారు. వీరందరికీ...

TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుగిరులు..
Tirumala Rush
Follow us

|

Updated on: Sep 11, 2022 | 4:58 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నందనం వరకు క్యూలైన్లో బారులు తీరారు. వీరందరికీ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శనివారం తిరుమలేశుడిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41 వేల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ. 4.22 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమలలో పెరిగిన రద్దీ దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. నూతన పరకామణిని సీఎం జగన్ 28వ తేదీన ప్రారంభిస్తారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమలలో భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సారి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం కల్పిస్తామన్నారు.

మరోవైపు.. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల కొండపై ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 26న అంకురార్పణ అనంతరం 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలోని ప్రధాన కూడళ్లు, పార్కుల వద్ద సుందరీకరణ పనులు ప్రారంభించారు. మాడ వీధులు, ఆలయం ఎదుట రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఆలయం ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు