Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుగిరులు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నందనం వరకు క్యూలైన్లో బారులు తీరారు. వీరందరికీ...

TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుగిరులు..
Tirumala Rush
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 11, 2022 | 4:58 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నందనం వరకు క్యూలైన్లో బారులు తీరారు. వీరందరికీ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శనివారం తిరుమలేశుడిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41 వేల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ. 4.22 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమలలో పెరిగిన రద్దీ దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. నూతన పరకామణిని సీఎం జగన్ 28వ తేదీన ప్రారంభిస్తారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమలలో భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సారి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం కల్పిస్తామన్నారు.

మరోవైపు.. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల కొండపై ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 26న అంకురార్పణ అనంతరం 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలోని ప్రధాన కూడళ్లు, పార్కుల వద్ద సుందరీకరణ పనులు ప్రారంభించారు. మాడ వీధులు, ఆలయం ఎదుట రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఆలయం ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..